ఒకప్పుడు వెంకటేష్ – సౌందర్య కాంబినేషన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరు సంపాదించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చిన సినిమాలు గా ఉండేది. సౌందర్య తను నటించిన ప్రతి సినిమాలోని సాంప్రదాయపరమైన పాత్రను ఎంచుకునేది. అలా వెంకీ – సౌందర్య కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
వీరిద్దరి కాంబినేషన్ లోనే వచ్చిన పవిత్ర బంధం సినిమాలో సౌందర్య నటించినట్టు వేరెవరు నటించలేరు. ఆమె ఆ పాత్రలో సహజత్వాన్ని ఉట్టిపడేలా చూపించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మొదటిగా రమ్యకృష్ణ హీరోయిన్ గా అనుకున్నారట. అయితే కథ పూర్తయ్యే టైం కి సౌందర్య అయితే ఈ సినిమాకు బాగా సెట్ అవుతుందనే ఉద్దేశంతో సౌందర్య నే తీసుకున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యతా ఎక్కువ.
దానికి తగ్గటే సౌందర్య ఆ పాత్రలో నటించి హిట్ కొట్టింది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ – సౌందర్య కాంబినేషన్ కు క్రేజ్ మరింత పెరిగింది. ఈ విధంగా రమ్యకృష్ణ పవిత్ర బంధం లాంటి హిట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ని మిస్ అయింది. అయితే సౌందర్య అప్పట్లో ఉన్న స్టార్ హీరోస్ అందరితో నటించారు. ఆమె అందం, అభినయంతో పాటు ఆమె చిరునవ్వును కోట్లాదిమంది ప్రేక్షకులు తమ గుండెల్లో ముద్ర వేసుకున్నారు.