దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి తన సినిమా కెరియర్ లో కొన్ని లక్షల మంది అభిమానుల అభిమానం సొంతం చేసుకున్నారు. శ్రీదేవి అంటే అప్పట్లో ఒక అందాల దేవత. ఆమెను చూసేందుకే దుబాయ్ షేక్లు అక్కడ నుంచి పనిగట్టుకు చెన్నై వచ్చేవారంటే ఆమె ఎంత గొప్ప అపురూప అందాలరాసో తెలుస్తోంది. అయితే శ్రీదేవి కెరీర్ ఆరంభంలో హీరోయిన్గా ఎంత సక్సెస్ అయినా ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
శ్రీదేవి ముందు నుంచి అమ్మకూచిగా ఉంటూ వచ్చింది. అయితే ఆమె అమ్మ చనిపోయాక ఆమె బాగా నమ్మిన బంధువులే ఆమెను మోసం చేసేశారు. దీంతో ఆమె తనకు ఎవరో ఒక మగతోడు కావాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే అప్పటికే పెళ్లయ్యి పిల్లలు ఉన్న బోనీకపూర్ను పెళ్లి చేసుకుంది. అతడి జీవితంలోకి రెండో భార్యగా వెళ్లింది.
అయితే అప్పటికే శ్రీదేవి ముగ్గురు స్టార్ హీరోలతో ప్రేమలో పడి మోసపోయింది. ఆమె ముందుగా కమల్హాసన్ను పిచ్చగా ప్రేమించింది. పైగా ఇద్దరూ బ్రాహ్మణ కులానికే చెందిన వారు కావడంతో కమల్ను పెళ్లి చేసుకోవాలని ఆరాటపడింది. అయితే కమల్ శ్రీదేవిని మోసం చేసి వాణి గణపతిని పెళ్లాడాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆమెను ప్రేమించాడు.
కనీసం రజనీ అయినా తనను ఆదుకుంటాడని శ్రీదేవి అనుకుంది. రజనీ కూడా శ్రీదేవికి హ్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్లిపోయాక అక్కడ మిథున్ చక్రవర్తిని బాగా నమ్మేసి సర్వస్వం అర్పించేసింది. అయితే మిథున్ శ్రీదేవిని రెండో భార్యగా ఉంచుకుంటానన్నాడు. అది నచ్చక చివరకు ఆమె బోనీకపూర్ మాటలు నమ్మేసి అతడి వలలో పడిపోయింది.