తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రొఫెషన్ లో సెట్ అవ్వాలన్న చాలా కష్టపడాల్సి ఉంటుంది. అది కూడా సింగర్ గా అయితే ఎంత కాంపిటీషన్ ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటిది ఛాన్స్ ను సంపాదించుకుని మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళల్లో కౌసల్య ఒకరు. శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్ ఇలా చాలా సినిమాల్లో తన పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కౌసల్య. అయితే దివంగత సంగీత దర్శకుడు చక్రి కాంబినేషన్ లో ఆమె పాడిన పాటలు ఆమెను ఒక రేంజ్ లో నిలబెట్టాయి.
అప్పట్లో ఆమె ఒక సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా… ఆమె పర్సనల్ జీవితంలో చాలా కష్టాలను అనుభవించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆమె వైవాహిక జీవితంలో ఆమె అనుభవించిన బాధలను గురించి పంచుకున్నారు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే కొడుకు భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకునే చాలా బాధలను భరించానని భర్త ఎన్ని సార్లు కొట్టిన సర్దుకుపోయేదానన్ని కౌసల్య చెప్పారు.
బాబు అప్పటికి చిన్నవాడు కావడంతో పిల్లలకు ఎప్పుడు తల్లి, తండ్రి రోల్ మోడల్స్ గా ఉంటారని. అబ్బాయిలు ఎప్పుడైనా తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుంటారని.. కానీ తల్లి దగ్గర పెరిగితే వాళ్ళు ఎలా ?ఉంటారు అనే విషయం క్లారిటీ లేక తన భర్త పెట్టిన బాధలను భరించాల్సి వచ్చిందని అక్కడ నుంచి బయటకు రాలేకపోయిందని చెప్పుకొచింది కౌసల్య. తాను ఎప్పుడు భర్త నుంచి విడిపోవాలి అనుకోలేదని.. అతనే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నన్ను వదిలి వెళ్ళిపోయాడని కౌసల్య చెప్పింది.
అయితే మీకు మరొక పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా అని కౌసల్యను అడిగిన క్వశ్చన్ కు ఆమె రెస్పాండ్ అవుతూ నా కొడుకు కార్తికేయ కు ఇప్పుడు 18 ఏళ్లు అని… వాడు ఇప్పటినుంచే నాగురించి ఆలోచించడం మొదలుపెట్టాడని చెప్పింది. నేను ఇప్పుడు పెద్దోడిని అయ్యానని.. నా గురించి ఆలోచన చేయకుండా రెండో పెళ్లి చేసుకోమని చెపుతున్నాడని కూడా కౌసల్య చెప్పింది. ఇక నాతో హ్యాపీగా ఉండగలరు అనే పర్సన్ ఎవరు తారసపడలేదని.. అలాంటి పర్సన్ నా లైఫ్ లోకి వచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని కౌసల్య చెపింది. దీన్నిబట్టి కౌసల్య తనకు కరెక్ట్ పర్సన్ దొరికితే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది.