విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్తో ఆల్ ఇండియానెంబర్ 1 హీరోయిన్ శ్రీదేవి కలిసిఅనేక సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. బాల నటిగా ఉన్నప్పటి నుంచి శ్రీదేవి ఎన్టీఆర్తో నటించారు. బడి పంతులు సినిమాలో ఆయనకు కుమార్తెగా నటించిన శ్రీదేవి తర్వాత కాలంలో అనేక సినిమాల్లో హీరోయిన్గా చేసింది. అయితే.. ఇద్దరి మధ్య కూడా..అవినాభావ సంబంధం ఉంది. శ్రీదేవి గారు.. దేవి గారు.. అంటూ.. అన్నగారు ఆటపట్టించేవారు.
అయ్యా హీరోగారూ.. అంటూ.. శ్రీదేవి చమక్కులు రువ్వేదట. మరి ఇలా సాగుతున్న వీరి సినిమా ప్రస్తానంలో వివాదానికి చోటెక్కడదనే ప్రశ్న వస్తుంది. అయితే.. ఇద్దరి మధ్య వివాదం కూడా తెరమీదికి వచ్చిందని సినిమా పండితులు చెబుతుంటారు. శ్రీదేవికి బాలీవుడ్లో అవకాశాలు రావడం ప్రారంభమవుతున్న కొత్తలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమెకు మంచి బూమ్ ఉంది. అయితే.. కొన్నాళ్ల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని భావించింది శ్రీదేవి.
ఇంతలో రాఘవేంద్రరావు.. అన్నగారి సినిమా ప్లాన్ చేశారు. అదే యమగోల. ఈ సినిమాలో అన్నగారి సరసన శ్రీదేవి నటించాల్సి ఉంది. ముందు ఆమెనే అనుకుని ప్లాన్ చేశారు. కానీ, అప్పుడప్పుడే బాలీవుడ్ చాన్స్లు దక్కించుకుంటున్న శ్రీదేవి.. తెలుగులో చేసే అవకకాశం వున్నా.. సమయం లేదని నిర్మాతకు చెప్పింది. ఇదే విషయాన్ని నిర్మాత అన్నగారికి చెప్పాడు. దీంతో అన్నగారు ఆగ్రహంతో ఊగిపోయారు.
“అవకాశం వచ్చి బాలీవుడ్కు వెళ్లింది కానీ… అక్కడ సక్సెస్ కాకపోతే.. ఏం చేస్తుందట“ అని ప్రశ్నించారు. ఇక, రాఘవేంద్రరావు.. జయప్రదను సంప్రదించి హీరోయిన్గా తీసుకున్నారు. ఇదీ.. సంగతి. వివాదం అయితే లేదు.. కానీ.. అవకాశం ఇచ్చి.. నటిగా గుర్తింపు తెచ్చిన తెలుగు ఇండస్ట్రీని తృణీకరించడం పట్ల మాత్రం అన్నగారు ఆవేదన వ్యక్తం చేశారు.