మాకు న‌మ్మ‌కం లేదు … జ‌గ‌న్‌కు దిమ్మ‌తిరిగే షాక్…!

ఏపీలో మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టి జనంలోకి వెళ్తోంది. అయితే ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ వేస్తోన్న స్టిక్క‌ర్ల‌కు కౌంట‌ర్‌గా జ‌న‌సేన కౌంట‌ర్ స్టిక్క‌ర్లు కూడా వేస్తోంది. మ‌రి కొంద‌రు అయితే ఏకంగా సెల్‌ఫోన్ల‌కు కూడా స్టిక్క‌ర్లు వేస్తున్నారు. అయితే ఉద్యోగులు మాత్రం జ‌గ‌న్‌కు షాకులు ఇస్తున్నారు. జ‌గ‌న్ మీపై మాకు ఇంకా న‌మ్మ‌కం కుద‌ర‌ట్లేద‌ని తేల్చి చెప్పేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే త‌మ యాక్ష‌న్ ప్లాన్ కూడా ఈ రోజు ప్ర‌క‌టించారు. ఏపీలో ఈ రోజు ఉద్యోగులు అంద‌రూ సెల్ఫోన్లు వాడ‌కూడ‌ద‌ని రూల్ పెట్టుకున్నారు. సెల్‌డౌన్ స్టార్ట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఉద్యోగులు అంద‌రూ క‌సితో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులు అంద‌రూ క‌లిసిక‌ట్టుగా సెల్ డౌన్‌తో త‌మ ఆవేదనను, నిరసన ప్రభుత్వానికి తెలియజేయాలని పిలుపు ఇచ్చారు.

ఇక సెల్‌ఫోన్ ద్వారా ఉన్న‌తాధికారులు ఇచ్చే సందేశాలు చ‌ద‌వ‌కూడ‌ద‌ని.. వాట్సాప్ ద్వారా వారు పంపే సూచ‌న‌లు కూడా పాటించ‌కూడ‌ద‌ని ఆయ‌న చెప్పారు. ఇక సోమ‌వారం అన్ని జిల్లా క‌ల‌క్ట‌రేట్ ల‌లో త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని స్పంద‌న కార్య‌క్ర‌మంలో ఆర్జీలిచ్చే కార్య‌క్ర‌మం సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. దీంతో ఉద్యోగులు ఈ రోజు సెల్‌డౌన్ స‌క్సెస్ చేయాల‌ని క‌సితో ఉన్నారు.

ఇక జ‌గ‌న్ ఇచ్చిన హామీల్లో కీల‌క‌మైన సీపీఎస్ రద్దు సహా ఇతర అనేక సమస్యలపై ఉద్యోగులు సమర శంఖం పూరించారు. ఇక ఉద్యోగులు అంద‌రూ ప్ర‌భుత్వ తీరుపై ర‌గిలిపోతున్నారు. త‌మ ప‌ట్ల‌ ప్రభుత్వ విధానాలను వారు ఎంత‌మాత్రం సమర్థించడంలేదు. సీపీఎస్ పై ఏదో ఒకటి తేల్చ‌డంతో పాటు ఇత‌ర బెనిఫెట్లు స‌కాలంలో ఇవ్వాల‌ని, ఇక ఒక‌టో తేదీనే జీతాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఉద్యోగులు జ‌గ‌న్ స‌ర్కార్‌కు వ‌రుస షాకులు ఇచ్చేందుకు ర‌గిలిపోతున్నారు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp