మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, హీరోయిన్ నిహారిక కొణెదల గత కొద్ది రోజులుగా వార్తల్లో ఉంటోంది. ఆమె మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అంత బలమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి కూడా హీరోయిన్ గా ఆమె రాణించలేకపోయింది. మెగా హీరోల మద్దతు ఉన్నా… మెగా ఫ్యాన్స్ ఆమెకు పూర్తిస్థాయిలో మద్దతివ్వలేదు. అసలు నిహారిక హీరోయిన్గా రావడం మెగాభిమానుల్లోనే చాలామందికి నచ్చలేదు.
ఇక నిహారికకు త్వరగానే పెళ్లి కూడా జరగడంతో, ఆమె పూర్తిగా కెమెరాకు దూరమైంది. ఇక గత పదిహేను రోజులుగా ఆమెకు భర్త చైతన్యకు తీవ్రమైన మనస్పర్థలు వచ్చేశాయని.. ఆమె భర్తతో విడిపోతోందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా చైతు, నిహారిక సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ఫాలో చేసుకున్నారు. ఒకరి ఫొటోలు మరొకరు డిలీట్ చేసి పడేశారు.
ఇక ఇప్పుడు మరో షాకింగ్ వార్త బయటకు వచ్చింది. భర్తకు దూరం కావాలని ఆమె ఇప్పటికే మానసికంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సారి భర్తతో సంబంధం లేకుండానే మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సారి హీరోయిన్ గా కాకుండా, నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే పింక్ ఎలిఫెంట్ అనే బ్యానర్ ను స్థాపించింది.
తాజాగా హైదరాబాద్ ఫిల్మ్నగర్లో ఆఫీస్ కూడా తెరిచింది. త్వరలోనే తన బ్యానర్ నుంచి వచ్చే కొత్త వెంచర్లు ప్రకటించబోతోంది. నిజానికి నిహారికకు ప్రొడక్షన్ కొత్త కాదనే చెప్పాలి. ఆమె పెళ్లికి ముందే యూట్యూబ్లకు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ఇప్పుడు అదే అనుభవంతో పూర్తిస్థాయి నిర్మాతగా మారాలనుకుంటోంది. కుదిరితే మంచి మంచి సినిమాలు నిర్మించాలనేది నిహారిక ఆలోచనగా తెలుస్తోంది. అంటే తన భర్తతో సంబంధం లేకుండానే ఆమె సినిమాలు నిర్మించేందుకు డిసైడ్ అయినట్టే కనిపిస్తోంది. అంటే ఇక భర్తకు దూరమైనట్టే ఆమె సిగ్నల్స్ కూడా ఇస్తోంది.