అతిలోక అందాల సుందరి శ్రీదేవి మరణం ఇప్పటికీ పెద్ద సందేహమే. శ్రీదేవిపై రు. 200 కోట్ల ఎల్ఐసి ప్రీమియంలు ఉన్నాయని.. కేవలం డబ్బు కోసమే ఆమెను హత్య చేసి అనుమానాస్పద మృతిగా మార్చేశారా ? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. అసలు అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న బోనీ కపూర్ జీవితంలోకి శ్రీదేవి రెండో భార్యగా వెళ్లటమే ఆమె చేసిన పెద్ద తప్పు.
ఇక శ్రీదేవి చనిపోయిన రోజు మద్యం సేవించి బాత్టబ్లో పడిపోయి మృతి చెందారని వార్తలు బయటకు వచ్చాయి. అసలు నిజంగానే ఆమెకు మద్యం తాగే అలవాటు ఉందా ? అన్న ప్రశ్నలు కూడా అప్పట్లో తెరమీదకు వచ్చాయి. అయితే శ్రీదేవికి చిన్నప్పటినుంచి మందు తాగే అలవాటు ఉందన్నది వాస్తవం. ఆమె స్నేహితులతో కలిసినప్పుడు.. సినిమా వాళ్ళ పార్టీలోనూ మందు తాగేవారు.
అయితే ఎంత మందు తాగినా ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉండేవారట. ఒక ఫుల్ బాటిల్ మందు కొట్టినా కూడా శ్రీదేవి ఎక్కడ తూలి పోయేవారు కాదట. ఆమె మైండ్ ఎప్పుడూ కంట్రోల్ లోనే ఉండేదట. శ్రీదేవి బాలనటిగానే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె షూటింగ్ చేసి ఇంటికి వచ్చాక అల్లరి చేస్తూ ఇంట్లో ఉన్నవాళ్లను నిద్రపోనిచ్చేది కాదట. అప్పుడే శ్రీదేవి తల్లి ఆమెకు లైట్గా మందు తాగించేవారట. ఆ మత్తులోనే శ్రీదేవి అలా పడుకుండిపోయేదట.
అయితే ఈ అలవాటు ఆమె యుక్తవయస్సుకు వచ్చేసరికి కాస్త పెరిగింది. ఆ టైంలోనే ఆమె హీరోయిన్ అయ్యి… తక్కువ టైంలోనే తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోయింది. అలా ఆమె మందు సేవించినా.. అది కాస్త లిమిట్గా.. ఎప్పుడూ కంట్రోల్ తప్పకుండా ఉండేది.