దగ్గుపాటి వారసుడుగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ తనదైన స్టైల్ లో కథలను ఎంచుకుంటూ ఎక్కువ విజయాలతో దూసుకుపోతున్నాడు. వెంకీ తన సినిమాలతో చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ వెంకటేష్ సినిమాలకు బాగా కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ తెచ్చుకున్న వెంకీ తాజాగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో రానా దగ్గుబాటి తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ వెబ్ సిరీస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చయి.
అయినా అత్యధిక వ్యూస్ సంపాదించిన వెబ్ సిరీస్ గా రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం వెంకి సైంధవ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ అయిన శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. హిట్, హిట్ 2 సినిమాలతో సక్సెస్ సాధించిన డైరెక్టర్ శైలేష్ నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. వెంకటేష్ బోయినపల్లి ప్రొడక్షన్ లో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు. హైదరాబాదులో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో కీలక నటులు పాల్గొంటున్నారు. మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ ఇందులో ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాల్లో హీరోయిన్ ఎవరనేది అధికారికంగా బయటకు రాలేదు. జెర్సీ సినిమా హీరోయిన్ అయినా శ్రద్ధ శ్రీనాథ్ ను ఈ సినిమాకు హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
శ్రద్ధ కూడా ఈ సినిమా చేయడానికి సైన్ చేసిందంటూ.. త్వరలోనే షూటింగ్లో పాల్గొంటుందంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే వెంకటేష్ – శ్రద్ధకు మధ్య 30 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండడంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ? ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది.ఈ సినిమా వెంకటేష్ కు 75వ సినిమా కావడం విశేషం.