మెగా వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్, ఉపాసన పెళ్లయ్యాక 11 ఏళ్లకు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఎప్పుడెప్పుడు తండ్రి అవుతాడా ? అని చూసినా మెగా ఫ్యామిలీ అభిమానులు.. చెర్రీ అభిమానులు చెర్రీ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయం బయటకు రావడంతో ఈ దంపతులకు విషెస్ తెలుపుతున్నారు. పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
అదే ఇంటర్వ్యూలో తన మ్యారేజ్, రిలేషన్ గురించి మాట్లాడుతూ.. ఏ రిలేషన్ షిప్ లో అయినా కచ్చితంగా గొడవలు ఉంటాయి. అలాగే మా జీవితంలో కూడా చాలా సార్లు గొడవలు జరిగాయి. కానీ ఎప్పుడూ గంటకు మించి మాట్లాడుకోకుండా ఉండలేదు అంటూ తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి వివరించింది ఉపాసన. అయితే గతంలో రామ్ చరణ్, ఉపాసనలపై ఒక న్యూస్ బాగా వైరల్ అయింది.
తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ వీరిద్దరి మధ్య గొడవకు కారణంఅంటు వార్తలు వచ్చాయి. ఆమె ఎవరో కాదు కాజల్ అగర్వాల్. గోవిందుడు అందరివాడేలే సినిమాలో కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ రొమాంటిక్ సీన్స్ మితిమీరిపోయి ఉండడంతో.. ఉపాసన, రామ్ చరణ్ గొడవ పడ్డారని.. వారిద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో ఉపాసన అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
ఇదే క్రమంలో కాజల్, చెర్రీకి మధ్య ఎఫైర్ నడిచిందని కూడా వార్తలు వినిపించాయి. కానీ చెర్రీ దంపతులు ఎప్పుడూ ఆ వార్తపై స్పందించలేదు. చరణ్ అభిమానులైతే ఆ వార్తను ఫాల్స్ స్టేట్మెంట్ అంటూ కొట్టి పడేశారు. అయితే ప్రస్తుతం చెర్రీ దంపతులు చాలా హ్యపిగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా – రామ్చరణ్ ఎఫైర్ విషయంలో కూడా వీరి మధ్య గొడవలు జరిగినట్టు పుకార్లు వచ్చాయి.