పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో వీరమల్లు, ఇటు సాయి ధరంతేజ్తో కలిసిన నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా బ్రో, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో ఓజి సినిమాలలో పవన్ నటిస్తున్నాడు. ఒకేసారి నాలుగు సినిమాలలో నటిస్తున్న పవన్ తన అభిమానులకు ఎక్కడా లేని ఉత్సాహం ఇస్తున్నాడు.
ప్రస్తుతం పవన్ నటిస్తున్న బ్రో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాకు కోలీవుడ్ దర్శకుడు హీరో సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. ఊర్వశి సంక్రాంతికి వచ్చిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా అదిరిపోయే ఐటమ్ సాంగ్ చేసి ప్రేక్షకులను మెప్పించింది.
ఇక ఈ సినిమా సెట్ లోకి ఎంటర్ అవుతూనే ఈ హాట్ బ్యూటీ పవన్ కళ్యాణ్ కు పిచ్చ ఫ్యాన్ గా మారిపోయింది అట. పవన్ నటించిన వింటేజ్ సినిమాలు చూడటం మొదలు పెట్టానని ఊర్వశి తెలిపింది. రోజుకు ఒక సినిమా చొప్పున పవన్ నటిస్తున్న అన్ని సినిమాలు చూస్తున్నానని… ఖుషితో మొదలుపెట్టి లేటెస్ట్ గా బద్రి ఇలా వరుసగా పవన్ సినిమాలు చూస్తున్నానని.. తాను పవన్ నటనకు పిచ్చ అభిమానిని అయిపోయానని పవర్ స్టార్ను ఆకాశానికి ఎత్తేస్తోంది.
ఈ విషయాన్ని ఊర్వశి తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ఏది ఏమైనా పవన్ సెట్లోకి ఎంటర్ అయిందో లేదో వెంటనే ఊర్వశి పవన్ కు పిచ్చ ఫ్యాన్ గా మారిపోయిందని.. పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక బ్రో సినిమా జులై 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.