పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. రామాయణ ఇతిహాసన్ని ఆధారంగా చేసుకుని భారీ మైథలాజికల్ జానర్ మూవీగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాఘవగా, కృతి సనన్ జానకిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ లంకేశ్ గా నటిస్తున్నారు. భారీ అంచనాలతో వస్తోన్న ఆదిపురుష్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్, టీజర్స్, ట్రైలర్స్ అన్ని కూడా ఇండియా వైడ్గా ఉన్న సినీ అభిమానుల్లో ఆసక్తి రేపాయి.
ఇక గత రాత్రి ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్గా నిర్వహించారు. ఇక తిరుపతి ఈవెంట్లో ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తే భారీ యాక్షన్తో పాటు, గ్రాండియర్ విజువల్స్తో ఉంది. పలు సీన్లు ఆడియెన్స్కు గూస్ బంప్స్ తెప్పించడంతో పాటు అదిరిపోయేలా ఉంది. ఇక ఫస్ట్ ట్రైలర్లో సీతా, రాముల ప్రేమకథ కట్స్ ఉంటే.. ఫైనల్ ట్రైలర్ మొత్తం యాక్షన్ ఘట్టాలతో నింపేశారు.
సీతను రాముడు వనవాసం నుంచి ఎత్తుకుపోవడం.. ఆ తర్వాత యుద్ధ సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఉంది. విజువల్స్ చూస్తుంటే గూస్బంప్స్తో పాటు ఖచ్చితంగా సినిమా చూడాలనిపించేలా ఉంది. అయితే మనం ఇప్పటికే తెలుగులో చాలాసార్లు చూసేసిన రామయణంలోని సీన్లనే అటు ఇటు తిప్పి మళ్లీ తీసినట్టుగా ఉందే తప్పా… కొత్తగా .. ఈ ట్రెండ్ జనరేషన్కు సింపుల్గా అర్థమయ్యేలా కథ చెప్పేందుకు దర్శకుడు ఎలాంటి టెక్నిక్స్, న్యూ స్క్రీన్ ప్లే వాడినట్టుగా అనిపించడం లేదు.
మనం గతంలో బుల్లితెరపై వచ్చిన రామాయణం సీన్లు, వెండితెరపై వచ్చిన సీన్లు యదావిథిగా అలాగే తీసినట్టుగా ఉంది. ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, సైఫ్ ఆలీఖాన్, వానర సైన్యం సీన్స్ ఎంతో బాగున్నాయి. ఫైనల్ ట్రైలర్తో అయితే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరి ఆదిపురుష్ ఫైనల్ రిజల్ట్ ఈ నెల 16న తేలిపోనుంది.