చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమా మరో స్టార్ హీరో చేయడం.. ఆ సినిమా హిట్ లేదా ప్లాఫ్ అవడం ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. తర్వాత కొన్ని రోజులకు ఆ సినిమా దర్శకుడు లేదా నిర్మాత ఈ సినిమాని ముందుగా ఆ హీరోతో చేద్దాం అనుకున్నాం అని చెప్పినప్పుడు.. ఆ హీరో అభిమానులంతా అయ్యో మంచి సినిమాను మిస్ అయ్యామే అని బాధపడుతూ ఉంటారు.
అదే సమయంలో ప్లాప్ అయిన సినిమా మిస్ అయితే హమ్మయ్య తప్పించుకున్నామని అనుకుంటారు. ఇలాంటి అనుభవాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇలా టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు మిస్ అయిన హీరోలుగా ఎన్టీఆర్- పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఇద్దరు హీరోలు వదులుకున్న బ్లాక్ బస్టర్ల లిస్టు తీస్తే మాత్రం వారి అభిమానులు చాలా బాధపడుతూ ఉంటారు.
మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడవ సినిమా గుంటూరు కారం. ఇక నిన్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, గ్లిమ్స్ వీడియో కూడా అభిమానులకు అందించారు. ఆ వీడియోకు అభిమానుల నుంచి ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ కూడా వస్తుంది. మహేష్ని ఊర మాస్ లుక్ లో చూసి చాలా కాలం అవుతుందని, ఇలాంటి ఓ మాస్ టీజర్ ఇచ్చినందుకు త్రివిక్రమ్ కు మహేష్ అభిమానులు ధన్యవాదాలు చెబుతున్నారు.
ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాని ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయాలని భావించారట త్రివిక్రమ్. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్- త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఎన్టీఆర్ స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత.. ఇందులో కొన్ని కీలక మార్పులు చేయమని చెప్పాడు. ఆ మార్పులు కూడా ఎన్టీఆర్కు అంతగా నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.
ఆ తర్వాత అదే కథ మహేష్కు చెప్పి ఒప్పించి.. ఇప్పుడు గుంటూరు కారం టైటిల్తో తెరకెక్కస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు ఈ సినిమాలో క్రూరమైన విలన్గా చేస్తున్నాడు.