మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి ఇండస్ట్రీలో రకరకాల షోలు పెరిగిపోతున్నాయి. మరి ముఖ్యంగా బుల్లితెరపై సరికొత్త రియాలిటీ షోలు స్టార్ట్ చేసి హ్యూజ్ రేంజ్ లో టిఆర్పిలను సంపాదించుకుంటున్నారు . ఇలాంటి క్రమంలోని స్టార్స్ కి సంబంధించిన విషయాలను జనాలకి తెలియజేసే విధంగా ఓసరి కొత్త టాక్ షో మొదలైంది . అదే “అలా మొదలైంది”. ప్రముఖ కమెడియన్ నటుడు వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న ఈ షో ఈటీవీలో ప్రసారమవుతుంది . కాగా ఇప్పటికే ఈ షో కి టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న నిఖిల్ ఆయన భార్య పల్లవితో గెస్ట్ గా వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే.
జనాలకు తెలియని ఎన్నో సీక్రెట్స్ ని ఈ షో ద్వారా బయటకు రాబడుతున్నారు వెన్నెల కిషోర్ . తాజాగా ఈ షో కి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఆయన సతీమణి మాలిని గెస్ట్ గా వచ్చారు . ఈ క్రమంలోని షో మొత్తం సందడి సందడి వాతావరణం నెలకొంది . చాలా సైలెంట్ గా తన పని తాను చూసుకొని వెళ్ళిపోయే వంశీ పైడిపల్లి .. మాలినితో లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ చేశారో ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ప్రోమోలో వంశీ లవ్ స్టోరీ హైలెట్ గా మారింది.
” ఆమె చేయి పట్టుకొని నీతో లైఫ్ చాలా బాగుంటుంది ” అని భావిస్తున్నానని ఓపెన్ గా చెప్పుకొచ్చేసారట . ఇలా చూసి చూడంగానే వంశీ పైడిపల్లి ఆమెకు లవ్ ప్రపోజల్ చేయడం ..ఆ తర్వాత ఓకే చేయడం చకచగా జరిగిపోయాయని .. ఆమె కోసం ఏకంగా బెంగళూరు వరకు బస్సులోనే వెళ్లే వాడిని అని చెప్పుకొచ్చారు. అంతే కాదు లవ్ లెటర్ రాసి.. చిలిపి సరసాలు గురించి కూడా చెప్పుకొచ్చారు. మాలిని కూడా వంశీ వ్యక్తిత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతుందని ..అందుకే ఎలాంటి కష్ట సమయంలో ఆయన చేయి విడవలేదు అని చెప్పుకొచ్చారు.
అంతేకాదు వంశి అప్పుడప్పుడు అలుగుతూ ఉంటారట . అలాగే తనకోసం అద్భుతంగా పాటలు కూడా పాడుతూ ఉంటారని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ వీళ్ళ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కాగా వంశీ – మాలిని 2007లో పెళ్లి చేసుకున్నారు . వీరికి ఓ పాప కూడా ఉంది . ప్రస్తుతం హైదరాబాద్ లోనే వీళ్ళు హ్యాపీగా తమ లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నారు . దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఏప్రిల్ 4న స్ట్రీమింగ్ కానుంది . చూడాలి మరి ఫుల్ ఎపిసోడ్ లో ఇంకెన్ని విషయాలు బయట పెట్టారో ఈ జంట..?