పుష్పలో దాక్షాయిని పాత్రని మిస్ చేసుకున్న ఆ హాట్ యాంకర్ …!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డులను తిరగరాసింది. అల్లు అర్జున్ కు పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్‌ను అందించింది. బాలీవుడ్‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయ్యి రు. 100 కోట్లు కొల్ల‌గొట్టింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ కూడా ఎంతో శరవేగంగా జరుగుతుంది.

ఈ సంవత్సరం చివ‌రిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు పుష్ప 2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రేక్షకులకు పుష్ప సినిమాతో ఎన్నో డిఫరెంట్ పాత్రలను పరిచయం చేశాడు సుకుమార్. వాటిలో ముఖ్యమైన పాత్ర దాక్షాయిని ఒకటి. ఈ క్యారెక్టర్ లో టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ నటించి మెప్పించింది.

ఈ సినిమాలో తన నటనతో ఎంత బోల్డ్‌ గా నటించిందో ఆమె సీన్స్ చూస్తూనే అర్థమవుతుంది. మరి ప్రధానంగా మంగళం శీను భార్యగా దాక్షాయినిగా త‌న న‌ట‌ విశ్వరూపం చూపించింది. అయితే ఈ పాత్రను ముందుగా అనసూయ కన్నా మరో హాట్ యాంకర్ శ్యామలను తీసుకోవాలని అనుకున్నారట. ఆమెను ఊహించుకొని ఈ సన్నివేశాలు కూడా రాశారట. కానీ అదే సమయంలో సుకుమార్‌ డైరెక్షన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటించి మెప్పించింది.

ఆమె నటనను చూసిన సుకుమార్ దాక్షాయినిగా ఆమె కరెక్ట్ గా సెట్ అవుతుంది.. అని భావించి అనసూయని తీసుకున్నారు. ఇక దీంతో మంచి అవకాశం శ్యామల మిస్ చేసుకున్నట్లు అయింది. ఏ మాటకు ఆ మాట శ్యామల కన్నా ఈ పాత్రకు అనసూయ పర్ఫెక్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే.