టాలీవుడ్ కింగ్ నాగార్జున అంటే రెండున్నర దశాబ్దాల క్రితం టాలీవుడ్ లో అమ్మాయిల కలల రాకుమారుడు. తన తండ్రి లెజెండ్రీ హీరో ఏఎన్నార్ సినీ వారసత్వం అందుకున్న నాగార్జున కూడా తండ్రిలాగానే అమ్మాయిల మనస్సులను దోచుకున్నాడు. అప్పట్లో నాగార్జునకు మహిళ అభిమానుల ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉండేది. విచిత్రం ఏంటంటే నాగార్జున సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే .. తొలి రోజు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా థియేటర్లలో సందడి చేసేవారు.
నాగార్జున ముందుగా దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నారు. నాగచైతన్య పుట్టాక ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం తనతో పాటు నిర్ణయం – శివ లాంటి హిట్ సినిమాలలో కలిసి నటించిన అమలను పెళ్లి చేసుకుని.. తన జీవితంలో రెండో భార్యగా స్వీకరించారు.
విచిత్రం ఏంటంటే అమలను పెళ్లి చేసుకున్నాక కూడా నాగార్జున కొందరికి హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్నాడన్న పుకార్లు ఆయనపై గట్టిగా వినిపించాయి. ఈ లిస్టులోనే టబు – అనుష్క లాంటి పేర్లు బాగా వైరల్ అయ్యాయి. ఇక టబు విషయానికి వస్తే నాగార్జునతో నిన్నే పెళ్ళాడుతా లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలో కలిసి ఆమె నటించారు. ఆ తర్వాత మరోసారి ఈ జంట ఆవిడ మా ఆవిడే సినిమాలోనూ నటించింది.
నిన్నే పెళ్ళాడుతా సినిమా అయిన తర్వాత నాగార్జున టబు చాలా డీప్ లవ్ లో పడిపోయారు. అలా వీరిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చేసారు. వీరి ప్రేమ విషయం ఇటు అమలకు కూడా తెలుసు అని.. అయితే టబు ఎక్కడ పరిధి దాటకుండా ఉండేదని.. అందుకే అమలు కూడా వీరి విషయంలో మౌనంగా ఉండేదని.. వీరి బంధం గురించి బాగా తెలిసిన వారు చెబుతూ ఉంటారు.
ఇక నాగార్జునను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ టబు ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్లి సినిమాలు చేసినా నాగ్ను మాత్రం మర్చిపోలేదు. ఆమె ఇప్పుడు ఎక్కువుగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. అది కూడా నాగార్జున ఇచ్చిన ఇంట్లోనే ఆమె ఉంటుందని.. నాగ్నే తన మనస్సు నిండా నింపుకుని పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయిందనే చెపుతూ ఉంటారు.