చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరో హీరోయిన్ల జాతకాలు చెబుతూ ఎప్పుడు సోషల్ మీడియాలో హైలెట్గా నిలుస్తారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. ఈయన ముందుగా సమంత- నాగచైతన్యాల పెళ్లి చేసుకునే సమయంలో వారిద్దరు విడిపోతారని చెబుతూ హాట్ టాపిక్ గా నిలిచారు. వేణు స్వామి చెప్పిన విధంగానే సమంత – నాగచైతన్య పెళ్లయిన కొన్ని సంవత్సరాలకు విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇక అప్పుడు వేణు స్వామి చెప్పిందే నిజం కావడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. ఇక ఇది కేవలం సమంత- నాగచైతన్య జీవిత విషయంలోనే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఆలస్యంగా తల్లిదండ్రులు అవుతారని ఎప్పుడో చెప్పారు వేణు స్వామి. ఇక ఇప్పుడు ఉపాసన మరి కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ విధంగా స్టార్ సెలబ్రిటీల జీవితంలో వేణు స్వామి చెప్పిన ప్రతి విషయం ఆలస్యంగా నిజం అవుతూ రావడంతో ఇప్పుడు ఆయనను నమ్మే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతూ వస్తుంది.
ఇదే విధంగా వేణు స్వామి గతంలో టాలీవుడ్కు చెందిన యువ హీరో చనిపోతారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.. ఆయన చెప్పిన విధంగానే తారకరత్న మరణించడంతో అందరు వేణు స్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయని నమ్మారు. అదే సమయంలో టాలీవుడ్కు చెందిన హీరో హీరోయిన్లు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చెప్పారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం మెగా హీరో వరుణ్, లావణ్య త్రిపాఠి ఈ ఇద్దరూ కలిసి త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని.. ఈ నెల 9న వీళ్లిద్దరికి ఎంగేజ్మెంట్ జరగబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు లావణ్య వరుణ్ పెళ్లి గురించి వార్తలు వస్తున్న క్రమంలో ఈ ఇద్దరి విషయంలోను వేణు స్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయి అంటూ ఆయన జోస్యం మరోసారి నిజమైంది అంటూ పలువురు గతంలో చేసిన పలు వ్యాఖ్యలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరోసారి వేణు స్వామి పేరు మరోసారి హట్ టాపిక్ గా మారింది..!!