టాలీవుడ్ మెగాస్టార్ గురించి తెలియని వారు ఉండరు.. చిత్ర పరిశ్రమలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో చిరంజీవి ముందు వరుసలో ఉంటారు.. టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చి ప్రస్తుతం టాలీవుడ్ కే మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్నాడు చిరు. ఇక ఆయన తర్వాత మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా ఎందరో హీరోలు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు.
అలాగే టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఇంతే సక్సెస్ అయ్యాడు.. బాహుబలి సినిమాలతో రాజమౌళి ఎక్కడికో వెళ్లిపోయారు.. ఇక గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని తీసుకువెళ్లాడు. ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి బ్రాండ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఈ విషయం ఇలా ఉంచితే రాజమౌళి తల్లికి.. మెగాస్టార్ చిరంజీవికి ఉన్న రిలేషన్ గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకుడుగా పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా రైటర్ గా మాత్రం భారీ స్థాయిలో సక్సెస్ అయ్యాడు.. ఇదే క్రమంలో రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఇక విజయేంద్ర ప్రసాద్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కుటుంబంలో ఉన్నవారికి కులమతాలతో సంబంధం లేదని.. ప్రధానంగా తన భార్య ఏ కులానికి చెందినదో ఇప్పటి వరకు తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.
ఇదే సమయంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ సినిమా విడుదలైనప్పుడు… తన భార్య విజయేంద్రప్రసాద్ మధ్య ఓ ఆసక్తికరమైన చర్చ జరిగిందని చెప్పుకొచ్చాడు. ఖైదీ సినిమా చూసి మా చిరంజీవి సినిమా అని… తన భార్య చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఆయన మీకు ఏమైనా బంధువా అని విజయేంద్ర ప్రసాద్ గారు అడిగారట. దానికి ఆమె కాదు.. ‘చిరంజీవి కూడా మా వాళ్ళే’ అంటూ సమాధానం ఇచ్చిందట. ఆమె చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని.. తన కుటుంబంలో చాలా మంది ప్రేమ వివాహం అది కూడా కులాంతర వివాహం చేసుకున్నారని అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు