స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు సమర్పణలో గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. గత ఏడాది యశోద లాంటి త్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఇప్పుడు నెలల గ్యాప్ తోనే శాకుంతలం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ వ్యాధి నుంచి కోలుకుని శాకుంతలం ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్న క్రమంలోనే మరోసారి ఆమె అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. జ్వరం వచ్చిందని.. గొంతు కూడా పోయిందని సోషల్ మీడియాలో సమంత పోస్ట్ పెట్టడంతో ఆమె అభిమానులు కూడా త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ సీనియర్ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మాత్రం అదంతా డ్రామా అంటూ సమంత పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ప్రతిసారి డ్రామాలు వర్కౌట్ కావంటూ మండిపడ్డారు. విడాకుల తర్వాత సమంత పుష్పలో ఐటమ్ సాంగ్ చేసింది.. తన బతుకు తెరువు కోసం ఆమె నటించింది.. హీరోయిన్ స్థాయి నుంచి ఐటమ్ గర్ల్ స్థాయికి పడిపోయాక తన చేతికి వచ్చిన సినిమాలు చేస్తోందని విమర్శించారు. హీరోయిన్గా సమంత కెరీర్ ముగిసిపోయింది.. ఆమెకు జీవితంలో ఇక స్టార్ డం రాదు.. మొన్న యశోద సినిమా సమయంలో కన్నీళ్లు కార్చేసి.. ఆ సినిమా సక్సెస్ చేసుకోవాలని ప్లాన్ చేసిందన్నారు.
ఇక శాకుంతలం సినిమా కోసం నేను చచ్చిపోయే లేపు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నా అని చెప్పింది. ఎందుకు ? ఈ డ్రామాలు ప్రతిసారి సెంటిమెంట్ వర్కౌట్ కాదు.. ప్రేక్షకులకు కథ, పెర్ఫార్మన్స్ నచ్చితే చూస్తారు.. అంతేకానీ అయ్యో పాపం ఆఖరి కోరిక అన్నట్టుగా సెంటిమెంట్ డ్రామాలు పండిస్తే ఎవరు ?సినిమాలు చూడరు.. ఇవన్నీ పిచ్చి పిచ్చి వేషాలు అని చిట్టిబాబు మండిపడ్డారు. ఇక స్టార్ హీరోయిన్ స్థాయి నుంచి ఐటెం స్థాయికి పడిపోయిన అమ్మాయి.. ఈ సినిమాకు హీరోయిన్గా ఎలా సెట్ అవుతుందనేది నా ప్రశ్న. ఈ సినిమాపై నాకు ఎంత మాత్రం ఆసక్తిలేదని చిట్టిబాబు తీవ్రంగా మండిపడ్డారు.