మహానటి సావిత్రి తర్వాత ఎందరో గొప్ప నటీమణులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మళ్ళీ అంతటి అందం, అభినయ వాచకం ఉన్న గొప్పనటిగా సౌందర్య పేరు మారుమోగింది. కన్నడ అమ్మాయి అయినా సౌందర్య తెలుగులో ఏకంగా 15 ఏళ్ల పాటు టాప్ హీరోలందరి సరసన నటించింది. కళ్ళతోనే కొన్ని వేల భావాలు పలికించే ప్రతిభ సౌందర్య సొంతం. అలాగే స్టార్ హీరోలతో మాత్రమే కాదు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలలోను నటించి సౌందర్య అలరించింది. తెలుగులో ఆమె చిరంజీవి- బాలకృష్ణ- వెంకటేష్- నాగార్జున- రజనీకాంత్ లాంటి అగ్ర హీరోల సరసన నటించి హిట్లు కొట్టారు.
సినిమాలకు గుడ్ బై చెప్పేశాక తన మేనబావను పెళ్లి చేసుకుని బెంగళూరులో సెటిల్ అయింది. 2004 ఎన్నికలకు ముందు బిజెపిలో జాయిన్ అయిన సౌందర్య కరీంనగర్లో అప్పటి కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు ప్రచారానికి హెలికాప్టర్లో బయలుదేరారు. సాంకేతిక లోపాలతో ఈ హెలికాప్టర్ కుప్పకూలడంతో సౌందర్య అకాలమరణం పాలయ్యారు. సౌందర్య మృతి చెందే టైంకు ఆమె ఏడు నెలల గర్భిణీ కూడా.
సౌందర్య మరణాంతరం ఆమె తల మొండెం నుంచి వేరుపడిందని.. అది కనిపించలేదని కూడా చెప్పుకున్నారు. ఇదే విషయంపై సౌందర్య సమకాలీన నటి, ఆమెకు అత్యంత స్నేహితురాలు అయిన ప్రేమ తాజా ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. సౌందర్య మరణం తన ఇంటికి వెళ్ళినప్పుడు తాను ఏడుపు ఆపుకోలేకపోయానని తెలిపారు. తాను సౌందర్య ఇంటికి వెళ్ళినప్పుడు.. ఆమె పార్టీవ దేహాన్ని ఒక బాక్స్ లో పెట్టారని.. ఆమె తల లేదు.. కేవలం మొండం మాత్రమే ఉందని.. అక్కడ వాళ్ళ అమ్మగారిని చూసి తాను చలించిపోయానని ప్రేమ తెలిపింది.
అయితే సౌందర్య బాడీ నుంచి తల వేరుపడడంతో.. ఆమె చేతికి ఉన్న వాచ్ ఆధారంగా ఆమెను గుర్తుపట్టారని ప్రేమ తెలిపింది. సౌందర్య సెట్లో అందరికీ శ్రీరామనవమి పానకం తాగించేది అని.. చాలా పరిమితమైన ఆహారం మాత్రమే తీసుకుంటుందని.. తనకు పప్పు అంటే ఏమిటో సౌందర్య వల్లే తెలిసిందని చెప్పింది. ఇక గోంగూర పచ్చడి ఆవకాయ తినటం ఇవన్నీ సౌందర్య వద్దే నేర్చుకున్న అని ప్రేమ చెప్పింది. సౌందర్యకు పప్పు బాగా ఇష్టం. అందులో నెయ్యి వేసుకుని తినటం బాగా ఇష్టమని ప్రేమ తన చిట్ చాట్ లో తెలిపింది.