టాలీవుడ్ లో నాగచైతన్య – సమంత జంట ఎంత స్పెషల్గా ఉండేవారో.. అలాగే రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ కూడా అంతే స్పెషల్గా ఉంటున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ప్రేమలో ఉన్నారని గత మూడు నాలుగేళ్లుగా ప్రచారం జరగటం.. అదంతా అబద్ధం అని ఇద్దరు కొట్టి పారేయటం.. ఆ తర్వాత కూడా ఇద్దరు కలిసి జంటగా కనిపించడం జరుగుతూ వస్తోంది. విజయ్ – రష్మిక స్నేహాన్ని చూసిన వాళ్లంతా వారిద్దరు కచ్చితంగా ప్రేమలో ఉన్నారని అంటూ ఉంటారు. అయితే విజయ్ – రష్మిక మాత్రం తాము మంచి స్నేహితులం అని.. తమ మధ్య ప్రేమా దోమా లేదని చెబుతూ ఉంటారు.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గీతాగోవిందం సూపర్ డూపర్ హిట్. డియర్ కామ్రేడ్ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి. ఇక టాలీవుడ్ దర్శక, నిర్మాతలు సైతం విజయ – రష్మిక కాంబినేషన్లో మరిన్ని సినిమాలు తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వీరిద్దరి అభిమానులు, నెటిజన్లు మాత్రం విజయ్ – రష్మిక ఒక్కటైతే చూడాలని ఉందని కామెంట్లు చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో వీరిద్దరి ప్రేమాయణం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటూ వస్తోంది.
అయితే తాజాగా రష్మిక విజయ్ దేవరకొండకు అదిరిపోయే షాక్ ఇచ్చిందని.. మనోడికి బ్రేకప్ చెప్పేసిందని.. అలాగే మరో టాలీవుడ్ యంగ్ హీరోకు దగ్గర అయిందంటూ బీటౌన్లో పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఇంతకు ఆ హీరో ఎవరో కాదు.. మన తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. వీరిద్దరూ కలిసి ఇటీవల నాలుగైదు సార్లు జంటగా కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందని రష్మిక విజయ్కు బ్రేకప్ చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ఇక రష్మిక.. బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవల తరచూ కలుస్తున్న విషయం నిజమే.
వారిద్దరి మధ్య ఏం ఉందనేది ? వారికే తెలియాలి. అయితే కొందరు నెటిజన్లు మాత్రం వీరి వ్యవహారం ఏదో తేడాగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు వాస్తవాలు కొద్ది రోజులు ఆగితే కానీ బయటికి రావు. ఇక రష్మిక చివరిసారిగా తమిళ్ హీరో విజయ్ కి జోడిగా వారీసు ( తెలుగులో వారసుడు ) సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమా చేస్తోంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.