నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం ఏ పని చేసినా.. అది సూపర్ సక్సెస్ అవుతోంది. ఇటు అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఓటిటిలలో బాలయ్య చేసిన షోలు ఒకదానిని మించి మరొకటి హిట్ అవుతున్నాయి. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కాజల్ అగర్వాల్ శ్రీలీలా లాంటి హీరోయిన్లు, సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
వచ్చే దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఆయుధపూజ పోస్టర్ తో ఇప్పటికే ప్రకటించారు. అటు వెండితెర మీద.. ఇటు బుల్లితెర మీద షేక్ చేస్తున్న బాలయ్య ఇప్పుడు ఐపీఎల్ కామెంటరేటర్గా కూడా కొత్త పాత్రలోకి ఎంటర్ అయ్యాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ కు బాలయ్య కామెంట్రీ చెప్పగా ఆ సమయంలో బాలయ్య చెన్నై టీం ఎంత స్కోర్ ? చేస్తుందో ముందుగానే అంచనా వేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు.
ఇక కాలేజ్ రోజుల్లో తాను కూడా క్రికెట్ ఆడేవాడిని అని… తనకు కూడా ఎంతోమంది క్రికెటర్లతో పరిచయం ఉందని బాలయ్య చెప్పాడు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాలయ్య క్లాస్మేట్స్. కిరణ్ కుమార్ రెడ్డి స్టార్ క్రికెట్ ప్లేయర్. ఇక తనకు ఇష్టమైన బౌలర్లు ఎవరు ? అన్న ప్రశ్నకు బాలయ్య ముగ్గురు పేర్లు చెప్పగా ముగ్గురు స్పిన్ బౌలర్లు కావటం విశేషం. టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, దక్షిణాఫ్రికా టాప్ స్పిన్నర్ పాల్ ఆడమ్స్, ఆస్ట్రేలియా లెజెండ్రీ క్రికెటర్, దివంగత స్పిన్ దిగ్గజం షేన్వార్న్ తనుకు ఇష్టమైన బౌలర్లు అని బాలయ్య చెప్పుకొచ్చాడు.
ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి సినిమా తర్వాత బాలయ్య వరుసగా బోయపాటి శ్రీను.. ఆ తర్వాత పూరి జగన్నాథ్ సినిమాలు చేయనున్నాడు. బోయపాటి శ్రీనుతో బాలయ్య చేసే సినిమా అఖండకు సిక్వెల్ గా ఉంటుందని కూడా తెలుస్తోంది.