సంచలన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తూ తెలుగుదేశం, జనసేన పార్టీలను విమర్శిస్తూ జగన్ మోహన్ రెడ్డిని పొగుడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయనకు సపోర్టుగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక రాంగోపాల్ వర్మ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. వర్మ 1962 ఏప్రిల్ 7న జన్మించాడు.. అంతేకాకుండా విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో తన చదువును పూర్తి చేశాడు.
చదువుకునే రోజుల్లోనే వర్మకు సినిమా రంగం పైనే ఎక్కువ ఆసక్తి ఉండేది. ఆ ప్రేమతోనే సినిమా రంగంలో అడుగుపెట్టి దర్శకుడుగా, నిర్మాతగా ఎన్నో విభిన్న చిత్రాలను తెరకెక్కించాడు. హారర్, మాఫియా సినిమాలు తీయటంలో రాంగోపాల్ వర్మను మించిన దర్శకుడు వేరే వారు లేరు. వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ, క్షణక్షణం సినిమాలో టాలీవుడ్ లోనే సూపర్ హిట్గా నిలిచాయి. ఈ రెండు సినిమాలు కాను తెలుగులో నంది అవార్డులను కూడా అందుకున్నాడు. ఇక రాంగోపాల్ వర్మ- రత్న అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
వీరికి రేవతి అనే అమ్మాయి కూడా జన్మించింది. రాంగోపాల్ వర్మ- రత్నా మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇక రత్నా తన కూతురు రేవతిని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఆ పాపను ఎంతో కష్టపడి పెంచి ప్రణవ్ అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసింది. ఇక ఆర్జీవి అల్లుడు అమెరికాలో డాక్టర్ గా పని చేస్తున్నాడు. ఇక వీరికి ఒక పాప కూడా ఉంది. రాంగోపాల్ వర్మ అప్పుడప్పుడు తన కూతురు మనవరాలతో ఫోన్లో మాట్లాడుతూ కలుస్తూ ఉంటాడని తెలుస్తుంది.