టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అయితే కొద్ది నెలల క్రిందట ప్రారంభమైన ఈ ట్రెండ్లో ముందు రిలీజ్ చేసిన సినిమాలకు బాగానే డబ్బులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ వికటించే పరిస్థితి వచ్చేసింది. కనీసం కొన్ని సినిమాలకు అద్దె ఖర్చులు కూడా రావటం. లేదు పోకిరి – జల్సా – చెన్నకేశవరెడ్డి – ఖుషి – ఆరెంజ్ సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అయ్యాయి. స్టార్ హీరోల అభిమానులను ఎమోషనల్ గా టార్గెట్ చేస్తూ వసూళ్లను రాబట్టుకోవాలని చూస్తున్నా డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ ఇప్పుడు రివర్స్ అవుతోంది.
ఇందుకు ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా సినిమా పెద్ద ఉదాహరణ. ఈ సినిమాను కొన్ని థియేటర్లలో స్క్రీనింగ్ చేశారు. ఈ సినిమా అప్పట్లోనే పెద్ద డిజాస్టర్. కనీసం ఎన్టీఆర్ అభిమానులు డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేయద్దని మరి వేడుకున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 లాంటి హిట్ సినిమాలు అయితే తాము ఎంజాయ్ చేస్తామని.. ఇలా డిజాస్టర్ సినిమాలు రీ రిలిజ్ చేస్తే యాంటీ ఫ్యాన్స్కు టార్గెట్ అవుతామని వాపోయారు.
అయితే బయ్యర్లు వినలేదు. తీరా ఈ సినిమా రిలీజ్ చేస్తే కనీసం రెండు మూడు వేల కలెక్షన్లు కూడా రాలేదట. ఇది నిజంగా ఎన్టీఆర్ పరువు తీసే పని. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ పరువు మరింత తీసేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులకు మంచి కిక్ వచ్చింది. మే 20న ఆది సినిమా కూడా వస్తుందని హఠాత్తుగా ప్రకటన రావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు పెద్ద గందరగోళానికి గురవుతున్నారు.
తమ హీరో నటించిన రెండు సినిమాలను ఒకేసారి రీ రిలీజ్ చేస్తే ఇబ్బందులకు గురవుతామని.. అలాగే రెండు సినిమాలలో ఏ సినిమాకు సరైన వసూళ్లు రావని.. దీంతో యాంటీ ఫ్యాన్స్ కు టార్గెట్ అవడంతో పాటు సింహాద్రి, ఆది ఏ సినిమాకు సరైన కలెక్షన్లు రావంటున్నారు. ఒక సినిమాకు రీ రిలిజ్ చేస్తే బాగుండేది. ఇలా ఒకేసారి ఒకేరోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ కన్ఫ్యూజ్కు గురవుతారు. అటు రికార్డులు మిస్ అవుతాయి. ఫైనల్ గా ఎన్టీఆర్ పరువు తీసినట్లు అవుతుందని అభిమానులు వాపోతున్నారు. మరి వీరి గోడు వినేవారు ఎవరో ?