2008లో నచ్చావులే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి మాధవీలత. ఈ సినిమా విజయాన్ని సాధించింది. ఆ తర్వాత నాని సరసన స్నేహితుడు సినిమా చేసింది. ఆ సినిమా అంతగా ప్రేక్షకులను అలరించలేదు. ఆ సినిమా తర్వాత ఓ యేడాది యూకేలో ఉండి ఫ్యాషన్ డిజైనింగ్ లో మాస్టర్స్ పట్టా పొందింది మాధవీలత. తర్వాత మళ్లీ హైదరాబాద్ వచ్చి సినిమాల్లోకి రియంట్రీ ఇచ్చి చిన్న చిన్న సినిమాలు చేసినా అవి విజయాన్ని అందించలేదు.
అనంతరం సినిమాల ఛాన్సులు తగ్గిపోవడంతో ఆమె ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల బుల్లితెరపై కామెడీ షోస్ అయినా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో గెస్ట్ గా కనిపించింది మాధవి లత. నచ్చావులే సినిమా తర్వాత మాధవీలతకు పెద్ద డైరెక్టర్ తన సినిమాలలో ఒక క్యారెక్టర్ ఉందని.. తన క్యారెక్టర్ గురించి వివరించారట. మాధవీలత కు ఆ స్టోరీ నచ్చడంతో ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తర్వాత ఏం జరిగిందో ? గాని ఆ సినిమాలో నటించే హీరో మాధవీలత ఉంటే నేను ఆ సినిమాలో నటించను అని చెప్పేసాడట.
దాంతో డైరెక్టర్ ఆమెను కలిసి మీరు ఈ సినిమాలో చేయడానికి కుదరదని.. ఆ సినిమా హీరోకి కమిట్మెంట్ ఇచ్చే హీరోయిన్ అయితేనే సినిమాలో నటించడానికి ఒప్పుకుంటానన్నాడని చెప్పాడట. దాంతో ఆ డైరెక్టర్ మాధవీలతతో నీకు నెక్స్ట్ సినిమాలో మంచి ఛాన్స్ ఇస్తానని… ఈ సినిమాలలో నువ్వు హీరోయిన్గా చేయడం కుదరదని చెప్పేశాడట. ఆ డైరెక్టర్ నాతో ఏ సినిమా తీయలేదని.. ఇప్పటికీ ఆ డైరెక్టర్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఉన్నాడని చెప్పింది.
ఇక తన మొదటి సినిమా డైరెక్టర్ తనతో కాస్టింగ్ కౌచ్కు ప్రయత్నించాడని చెప్పింది. ఆమె దానికి ఒప్పుకోకపోవడంతో నీకు సినిమాలో ఛాన్సులు రాకుండా చేస్తానని ఆ డైరెక్టర్ అన్నాడని.. అతను కూడా నాకు సినిమా ఛాన్సులు రాకపోవడానికి ఒక కారణం అయ్యి ఉండొచ్చు అని కూడా ఆమె చెప్పింది. మాధవీ లత మాట్లాడిన విషయాలు కాంట్రవర్సీలకు దారి తీయడంతో పాటు ఇండస్ట్రీలో కొందరు ఆమెను టార్గెట్ చేశారు.