ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా ఎదగడంచాలా కష్టం. అలా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఎన్నో కష్టాలను, అవమానాలను భరించిన తర్వాత సినిమా ఛాన్సులతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న స్టార్ హీరో చిరంజీవి. చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన కెరీర్ స్టార్టింగ్ లో ఏ చిన్న క్యారెక్టర్ వచ్చినా ఆ సినిమాలలో నటించేవారు. చిరు నటన, డాన్స్ పరంగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు.
తర్వాత వరుస సినిమాలతో దూసుకు వెళ్లారు. చిరంజీవి ఇప్పటికీ సినిమాలు తీస్తూనే ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా చిరు సినిమాలు హిట్ అవుతున్నాయి. అప్పట్లో చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే చిరు ఫ్యాన్స్ లో అంచనాలు ఒక రేంజ్ లో ఉండేవి. చిరు నటించిన సినిమాల్లో జై చిరంజీవ సినిమా ఒకటి. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టోరీ, డైలాగ్స్ అందించిన విషయం అందరికీ తెలుసు. విజయ్ భాస్కర్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో భూమిక, సమీరారెడ్డి ఇద్దరు హీరోయిన్లు నటించారు.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్గా మిగిలింది. ఈ సినిమా ద్వారా చిరంజీవితో సినిమా చేయడానికి కథను రాసే అవకాశం దొరికిందని త్రివిక్రమ్ హ్యాపీగా ఫీల్ అయినట్టు చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ సినిమాలో మేనకోడల్ని చంపిన వారిపై రివేంజ్ తీసుకోవడానికి సెర్చింగ్ చేస్తూ ఉంటాడు చిరంజీవి. ఈ సినిమాలో సినిమాలో భూమిక పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఈ పాత్ర కోసం మొదట్లో త్రిషను తీసుకోవాలని భావించారట.
త్రిష సినిమాల్లో బిజీగా ఉండడంతో డేట్లు ఖాళీ లేక ఆమె ప్లేస్ లో భూమికను తీసుకున్నారట. ఈ సినిమా అంతగా ఆడకపోయినా భూమికకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది భూమిక. పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న భూమిక.. ఇటీవల కాలంలో నాని ఎంసీయే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నానికి వదినగా భూమిక నటించింది.