1970వ దశకంలో టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లు ఒక వెలుగు వెలిగారు. జయసుధ, జయప్రద, శ్రీదేవి వాణిశ్రీ, జయంతి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలానే ఉంది. వీరిలో జయప్రద అచ్చ తెలుగు అమ్మాయి. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు అటు తమిళ స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది.
బాలీవుడ్ సినీ జనాలతో పాటు నార్త్ ఇండియన్ ప్రేక్షకులు ఆమె అందచందాలకు ఫిదా అయిపోయారు. జయప్రద అందం కోసం నార్త్ ఇండియన్ సినీ జనాలు థియేటర్లకు క్యూ కట్టేవారు. సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన జయప్రద వ్యక్తిగత జీవితంలో మాత్రం తాను చేసిన తప్పుతో పాతాళంలోకి వెళ్లిపోయింది. బాలీవుడ్లో అగ్ర నిర్మాతగా ఉన్న సునీల్ తన కుమారుడు శ్రీకాంత్ నహతాను ఆమె ప్రేమించింది. అప్పటికే శ్రీకాంత్ కు పెళ్లి అయ్యి.. పిల్లలు కూడా ఉన్నారు.
అతనితో నీకు ప్రేమ దోమ వద్దు.. మంచి లైఫ్ ఉంది అని ఎంతోమంది చెప్పినా జయప్రద వినలేదు. అతడు చూపించిన కపట ప్రేమకు లొంగిపోయింది. అతడిని పెళ్లి చేసుకుంది. ఎంత దారుణం అంటే ?పెళ్లి అయిన వారానికే అతడి నిజ స్వరూపం ఆమెకు తెలిసి వచ్చింది. కేవలం తనను వాడుకునేందుకు మాత్రమే అతడు పెళ్లి చేసుకున్నాడని.. మొదటి భార్య కండిషన్ మేరకు పిల్లల పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడన్న విషయం జయప్రదకు తెలిసింది. దీంతో ఆమె గుండె బద్దలైంది.
భర్త చేసిన మోసం తట్టుకోలేకపోయింది. చాలా ఏళ్లపాటు తనలో తానే బాధపడుతూ కృంగిపోయింది. చాలా రోజులు పాటు భర్త ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరిస్తూ వచ్చింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళింది. చివరకు భర్త సినిమా వాళ్ళతోను.. రాజకీయ నేతలతో తనకు ఎఫైర్లు అంటగట్టటం ప్రారంభించాడు. ఈ బాధలు తట్టుకోలేక ఆమె విడాకులు ఇచ్చేసి అతడికి దూరమైంది. ఆ తర్వాత తనకంటూ ఒక జీవితం ఏర్పరచుకుని ముందుకు వెళుతుంది.