సినిమాల్లో నేటి తరానికి కావాల్సింది.. హీరోయిన్ అందాలే. అభినయం.. ఇతరత్రా విషయాలు ఎలా ఉన్నా.. హీరోయిన్ ఎక్స్పోజింగ్కే యువతతో ధియేటర్లు నిండిపోతున్నాయనేది ఇటీవల భారత సినీరంగంపై చేసిన ఓ సర్వే తేల్చి చెప్పింది. అయితే.. వారసత్వంగా వచ్చిన ఓ యువ హీరోయిన్.. ఇప్పుడు యువత గుండెల్లో గుబులు రేపుతోంది. ఆమెను చూసిన వారు తల్లిమించిన ఎక్స్ పోజింగ్తో కట్టిపడేస్తోందిగా అంటున్నారు.
ఆమే.. ఆలిండియా నెంబర్ 1 హీరోయిన్ శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్. శ్రీదేవి గురించి అందరికీ తెలిసిందే. అనేక సినిమాల్లో నటించి.. ఇటు తెలుగు, అటు తమిళంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదేసమ యంలో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి.. అందరినీ ఆకట్టుకుంది. అయితే.. తొలినాళ్లలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి.. కొన్నాళ్లకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా.. ఎక్స్ పోజింగ్కు దూరంగానే ఉంది.
అయితే.. పదహారేళ్ల వయసు చిత్రం నుంచి కొంత ఎక్స్పోజింగ్ డిమాండ్ చేసే పాత్రల్లోనూ నటించింది. ఇక, బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాక.. బికినీ కూడా వేసుకుంది. అయినప్పటికీ.. శ్రీదేవి.. ఆదిలోనే ఎక్స్పోజింగ్ చేయలేదనేది వాస్తవం. కానీ, ఆమె కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మాత్రం ఎంట్రీతోనే ఎక్స్ పోజింగ్ అదరగొడుతోంది. త్వరలోనే ఎన్టీఆర్ 30 సినిమాలో నటించేందుకు ఆమె రెడీ అయింది.
ఈ సినిమాలో మాస్ మసాలా రంగ రించి..యువతకు గిలిగింతలు పెట్టేందుకు జాన్వీ రెడీ అయిపోయింది. ఏమాత్ర తొట్రుపాటు లేకుండా.. జాన్వీ స్విమ్ సూట్ నుంచి బికినీ ల వరకు హాఫ్ టాప్ నుంచి అన్ని రకాల దుస్తులు ధరించేందుకు రెడీ అంటోంది. నటన పరంగా ఎలా ఉన్నప్పటికీ.. తన ఎక్స్ పోజింగ్ తో మాత్రం తల్లి ని మించిపోయిందని అంటున్నారు జాన్వీని చూసినవారు.