లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును పొందిన విజయశాంతి తర్వాత.. అంతటి పేరు తెచ్చుకున్న తమిళకుట్టి.. నయనతార. ఆమె భర్త విఘ్నేశ్ శివన్. శివన్ను ఆమె ప్రేమ పెళ్లి చేసుకుంది. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లల కూడా తల్లయింది. అటు వైవాహిక జీవితంలో.. ఇటు కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది నయన తార. పౌరాణిక పాత్రల నుంచి బికినీ వరకు అన్ని పాత్రల్లోనూ తన సత్తా చాటింది.
అయితే.. శివన్ను ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం అనే విషయంలో నయన జీవితం అనేక మలుపులు తిరిగింది. ‘నేనూ రౌడీనే’ అనే చిత్రం మొదలు కావడానికి కంటే ముందే తొలుత శివన్.. నయన తారను ప్రేమించాడు. అయితే.. ఆమె సెట్స్కు వచ్చేప్పుడు గంభీరంగా రావడం.. అంతే గంభీరంగా ఉండడం.. షూటింగ్ అయిపోయాక కూడా అలానే వెళ్లిపోవడంతో మూడేళ్లపాటు.. అసలు నయనతో తన ప్రేమ సంగతి చెప్పలేదట.
మరోవైపు శివన్ దర్శకత్వం వహించిన ‘పోడాపోడి’ అనే తమిళ సినిమా ఫెయిల్ అయిపోయింది. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. కెరీర్ పరంగా కష్టాలు ఎదుర్కొంటోన్న సమయంలో ‘నేనూ రౌడీనే’ కథ రాసుకుని.. హీరో ధనుష్, నయనతో సినిమా తీశాడు. ఆ తర్వాత సినిమా సెట్లో ఆమెను మేడమ్ అనే పిలిచేవాడు. ఆఖరికి నయన్ కారవ్యాన్లోకి వెళ్లి.. సాహసోపేతంగా తన ప్రేమను వెల్లడించాడు. ముందు ఆమె చాలా వరకు తటపటాయించిందట.
మాది సంప్రదాయ కుటుంబం.. ప్రేమలు.. కుదరవు అని చెప్పినా.. నెమ్మదిగా ఒప్పించే సరికి మరో రెండేళ్లు పట్టిందట. మొత్తానికి ధనుష్ మధ్యవర్తిత్వంతో నయన ఒప్పుకుందని.. అయితే.. తాను ఒప్పుకొన్నాక తమ ప్రేమ మరింత చిగురించిందని శివన్ చెప్పడం విశేషం. తెలుగు, తమిళ భాషలు సహా.. ఇప్పటికి 70 సినిమాల్లో నయనతార నటించింది.