టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లుగా రానించిన వారిలో ఛార్మీ కూడా ఒకరు. ఈ పంజాబీ ముద్దుగుమ్మ తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించి అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లో ఛార్మీ నటించిన పౌర్ణమి, రాఖీ, లక్ష్మీ లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇక చివరగా ఛార్మీ పూరీజగన్నాత్ దర్శకత్వంలో జ్యోతిలక్ష్మి అనే సినిమాలో నటించింది.
ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ సమయంలో ఛార్మీకి పూరీతో ఏర్పడిన పరిచయం కాస్త ఇద్దరినీ క్లోజ్ ఫ్రెండ్స్ ను చేసింది. అంతే కాకుండా ఛార్మీ పూరిజగన్నాత్ సొంత బ్యానర్ పూరీ కనెక్ట్స్ లో వ్యాపార భాగస్వామిగా మారి ప్రస్తుతం నిర్మాతగా రానిస్తోంది. వీరిద్దరి నిర్మాణంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా వీరిద్దరి కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా లైగర్ తెరకెక్కింది. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
దాంతో నిర్మాతలగా ఛార్మీ మరియు పూరీజగన్నాథ్ దారుణంగా నష్టపోయారు. ఇదిలా ఉంటే ఛార్మీ ప్రస్తుతం పూరిజగన్నాథ్ లో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి రిలేషన్ షిప్ పై ఎలాంటి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. అయితే ఏజ్ బార్ అవుతున్నా ఛార్మీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి ఓ కారణం ఉంది. ఈ విషయాన్ని ఛార్మీ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే తాను ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించానని ఛార్మీ చెప్పింది. కానీ అది వర్కౌట్ కాలేదని అబద్దపు ప్రేమ చూపించడం వల్లనే అది వర్కౌట్ కాలేదని తెలిపింది. ఇక తన తల్లి తనను పెళ్లి చేసుకోవాలని కోరిందని కానీ తను పెళ్లి చేసుకుని ఇంటికి పరిమితం కాకూడాదనే పెళ్లికి దూరంగా ఉంటున్నానని చెప్పింది. మరి ఫ్యూచర్ లో అయినా ఛార్మీ పెళ్లి చేసుకుంటుందా లేదా చూడాలి