టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్బాబు సినిమాలు అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. మోహన్బాబు విలన్ పాత్రల నుంచి హీరో పాత్రలు పోషించే స్థాయికి కష్టపడి వచ్చాడు. మోహన్బాబు విలక్షణ నటుడు.. ఆయన ఓ కలెక్షన్ కింగ్. అలాంటి మోహన్బాబు ఎన్నో సిల్వర్ జూబ్లి సినిమాలు, 365 రోజుల సినిమాల్లో నటించారు.
పెదరాయుడు, అల్లుడుగారు, కలెక్టర్గారు, అసెంబ్లీ రౌడీ ఇలా ఎన్నో సినిమాల పేర్లు మనకు గుర్తుకు వస్తాయి. అలాంటి మోహన్బాబు ఇప్పుడు పూర్తిగా ప్రజల ఆదరణ కోల్పోయారు. అసలు ఆయన సినిమాలు వస్తున్నాయంటే పట్టించుకునే వారే లేరు. మోహన్బాబు ఫ్యామిలీపై సోషల్ మీడియాలో లెక్కకు మిక్కిలిగా ట్రోలింగ్లు వస్తున్నాయి.
ఇక మా ఎన్నికల్లో మోహన్బాబు చాలా మందికి టార్గెట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా చాలా ఘోరమైన రికార్డులు మూటకట్టుకుంది. ఈ సినిమా రిలీజ్ రోజునే ఓ థియేటర్లో చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ సినిమాకు కేవలం తొలి రోజు కేవలం రెండు టిక్కెట్లు మాత్రమే తెగాయి. అసలు ఇది ఎంత చెత్త రికార్డో చూడొచ్చు.
ఇప్పుడు ఈ రికార్డును అల్లు అర్జున్ బ్రేక్ చేశారు. బన్నీ నటించిన దేశముదురు సినిమా రీ రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలోనే అమలాపురంలో ఈ సినిమాను ప్రదర్శిస్తోన్న థియేటర్లో మార్నింగ్ షోకు కేవలం ఒక్కటంటే ఒక్క టిక్కెట్టే తెగింది. సో ఇప్పటి వరకు మోహన్బాబు ఖాతాలో ఉన్న ఈ చెత్త రికార్డు ఇప్పుడు బన్నీ ఖాతాలో పడింది. అసలు రీ రిలీజ్ సినిమాల్లో ఆరెంజ్ లాంటి ప్లాప్ సినిమా కూడా సరికొత్త రికార్డులు బ్రేక్ చేస్తుంటే బన్నీ బ్లాక్బస్టర్ దేశముదురు మాత్రం పరమ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకుంది.