సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల్లో సిటాడెల్ వెబ్సీరిస్ కూడా ఒకటి. తెలుగు దర్శకద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సమంతకు జంటగా నటిస్తున్నాడు. హాలీవుడ్లో రూసో బ్రదర్స్ దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్కు ఇండియాలో ఇది రీమేక్గా వస్తుంది. హాలీవుడ్ వెర్షన్లో ప్రియాంక చోప్రా పోషించిన పాత్రను ఇండియాలో సమంత పోషిస్తోంది.
ప్రస్తుత ఈ వెబ్సిరీస్ షూటింగ్ సర్బీయాలో ఎంతో శరవేగంగా జరుగుతోంది. ఈ వెబ్ సిరీస్ కు సమంత అందుకుంటోన్న పారితోషకం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తన గత సినిమాలకు నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల రేంజ్లో పారితోషకం తీసుకునే సమంత.. ఈ సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోందట.
ఇప్పుడు ఈ విషయం బయటికి రావటంతో రెమ్యునరేషన్ విషయంలో సమంత ముందు బాలీవుడ్ స్టార్లు కూడా దిగదుడుపే అన్న గుసగుసలు నడుస్తున్నాయి. మామూలుగా బాలీవుడ్ బడా స్టార్ హీరోయిన్లకే సినిమాకు రు. 8 – 10 కోట్ల రేంజ్లో తీసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అలియా భట్, దీపికా పదుకొనే, కంగనా వంటి స్టార్లు కూడా రూ.8 కోట్ల మేర పారితోషకం అందుకుంటున్నారు.. అది కూడా సినిమాలకు..! కానీ సమంత ఇప్పుడు వారందరినీ దాటిపోయింది. వెబ్సీరిస్ కోసమే ఏకంగా రు. 10 కోట్లు పుచ్చుకుంటోంది.
ఇదే సమయంలో సమంత ఇతర ప్రాజెక్టుల విషయానికి వస్తే టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా వరుస ప్రాజెక్టులతో సమంత బిజీగా కొనసాగుతోంది.