పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అప్పటి నుంచి ప్రభాస్ ఏ సినిమా చేసినా సరే పాన్ ఇండియా రేంజ్లోనే రికార్డులను క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. అయితే ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ ఆశలన్నీ ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోయే ఆదిపురుష్ మీద పెట్టుకున్నాడు.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమయంలో ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్టు కే, తెలుగులో మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్.. ఇలా వరుస సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల తర్వాత వెంటనే ప్రభాస్ మరో క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేశాడు. దర్శకుడు సందీప్ వంగా. రణబీర్ కపూర్తో సందీప్ తెరకెక్కిస్తోన్న యానిమల్ సినిమా పూర్తయ్యాక ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమా స్టోరీని సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో చేయాలని అనుకోలేదట. మరో తెలుగు స్టార్ హీరో మహేష్బాబుతో చేయాలని భావించారట.
అదే సమయంలో మహేష్ కి స్టోరీ వినిపించగా ఇందులో భారీ యాక్షన్ సీన్స్.. చాలా రొమాంటిక్ సీన్స్ తో పాటు వల్గర్ డైలాగ్స్ కూడా ఉంటాయని సందీప్ చెప్పాడట. దీంతో మహేష్ తన ఇమేజ్కు సూట్ అవ్వదన్న కారణంతో ఈ సినిమాకు నో చెప్పారట. ఆ తర్వాత అదే స్టోరీతో ప్రభాస్ వద్దకు వెళ్ళగా ఆయన ఓకే చేశాడు.