సమంత హీరోయిన్ గా, దేవ్ మోహన్ హీరోగా ఈరోజు తెరపైకి వచ్చింది శాకుంతలం. గుణ టీం వర్క్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడక్షన్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ బాబు, సచిన్ ఖేద్కర్ ప్రధాన పాత్రలలో నటించారు. అది ఫిబ్రవరి 17న విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడి ఈనెల 14న రిలీజ్ అయింది. ఈ సినిమా హిస్టారికల్ స్టోరీతో తెరకెక్కింది. శకుంతల పాత్రలో నటించింది సమంత. ఈ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా చాలా ఇంటర్వ్యూలో సమంత పాల్గొంది.
ఓ ఇంటర్వ్యూలో సమంతను క్వశ్చన్ చేస్తూ మీరు నటించిన కణ్మణి రాంబో ఖతిజా.. తెలుగులో విడుదల అయిన ఈ సినిమా విజయ్ సేతుపతి హీరోగా, సమంత, నయనతార ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో నయన్ మొదటి భార్యగా సమంత రెండో భార్యగా ఇద్దరు భార్యలు కావాలని కోరుకుంటాడు విజయ్ సేతుపతి. సమంత కూడా విజయ్ నయన్ను ప్రేమించాడని తెలిసినా సరే అతడిని ప్రేమిస్తూనే ఉంటుంది.
అదే కథను కామెడీ సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమా గురించి ఒక క్వశ్చన్ అడుగుతూ ఇద్దరు భార్యలు ఉన్న కాన్సెప్ట్ను సమర్థిస్తూ ఆ సినిమాలో నటించడానికి ఎలా ఒప్పుకున్నారు..? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగగా.. దానికి సమంత స్పందిస్తూ నాకు కామెడీ చేయడం అంటే ఇష్టం. ఈ సినిమాలో నా రోల్ చాలా కామెడీగా ఉంటుంది. అంతేకాక నేను టైడ్ అయిన టైంలో రిలీఫ్ కోసం కామెడీ తెప్పించే సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానని తెలిపింది.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి నటించడం కూడా ఒక ప్రధాన కారణం. నాకు వీరిద్దరితో యాక్ట్ చేయాలని ఎప్పటినుంచో ఉంది. దాంతో అవకాశం రాగానే సినిమా చేయడానికి సైన్ చేశాను అంటూ సమంత చెప్పింది.