ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది సమంత. ఈ సినిమాలో చైతు సరసన నటించింది. ఈ సినిమా షూటింగ్ టైంలోనే చైతు, శ్యామ్ ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కొద్ది సంవత్సరాల ప్రేమాయణం తర్వాత వీరిద్దరికీ పెళ్లి జరిగింది. అయితే ఇటీవల కాలంలో కొన్ని పర్సనల్ కారణాల చేత వీరిద్దరూ విడిపోయారు.
వీరిద్దరూ విడిపోయిన తర్వాత తప్పంతా సమంతాదే అంటూ, నాగచైతన్యది అంటూ, చైతు ఫ్యామిలీ వల్ల సమంత చైతుకి విడాకులు ఇచ్చిందంటూ చాలా రకాల వార్తలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం చైతు పై ఉన్న ప్రేమతోనే స్యామ్ – చైతు జీవితం బాగుండాలని ఉద్దేశంతోనే చైతుకి విడాకులు ఇచ్చిందని మరో వార్త బాగా వైరల్ అవుతుంది. చైతు పై ఉన్న ప్రేమతో అతనికి విడాకులు ఇవ్వడం ఏంటి ? సమంతకి ఏమైనా పిచ్చా.. అంటు నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
అసలు సంగతేంటంటే సామ్ కు మయోసైటీస్ ఉన్న సంగతి విడాకుల ముందే తెలుసని.. మయాసైటిస్ ద్వారా పిల్లలు పుట్టడానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో చైతుకు సమంత వల్ల ఎటువంటి ? ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో.. చైతు లైఫ్ బాగుండాలని సామ్ అతని నుంచి విడాకులు తీసుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సామ్, చైతు వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే గాని ఎంత నిజం ఉందో ?తెలియదు. ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం స్పీడ్ గా వైరల్ అవుతుంది.
అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి లైఫ్ లో వారు బిజీగా గడుపుతున్నారు. నాగచైతన్య కస్టడీ మూవీ ఈవెంట్స్ లో బిజీగా ఉన్నారు. సమంత ఇటీవల నటించిన శాకుంతలం సినిమా ఈరోజు రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సమంత ఖుషి మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉంది.