టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ చేసిన శాకుంతలం సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చి ఘోరమైన ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుతో కలిసి గుణశేఖర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. మహాభారతంలోని ఆదిపర్వంలో శాకుంతల – దుష్యంతుడి ప్రణయ ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు.
అయితే అందరికి తెలిసిన రొటీన్ కథ కావడంతో పాటు గుణశేఖర్ మ్యాజిక్ వర్కవుట్ కాకపోవడం, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పూర్తిగా తేలిపోవడంతో సినిమా ఘోరమైన టాక్ సొంతం చేసుకుంది. సమంత లాంటి స్టార్ హీరోయిన్, దిల్ రాజు బ్యాకప్, పైగా త్రీడీ హంగులు ఇవేవి ఈ సినిమాను కాపాడలేకపోయాయి.
అసలు ఎంత ఘోరం అంటే ఈ సినిమాకు లాంగ్ రన్లో కేవలం 30 శాతం కలెక్షన్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్లో 30 శాతం వసూళ్లు వస్తాయో రావో అన్నట్టుగా ఉంది. మృగరాజు, సైనికుడు తర్వాత గుణశేఖర్ కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా శాకుంతలం నిలవనుంది. సమంత కెరీర్లోనూ ఇది ఘోరమైన అవమానం.
ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్లు చూస్తే ఏపీ, తెలంగాణలో కేవలం 1.90 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.05 కోట్లు – ఓవర్సీస్ 1.25 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇప్పటికే వసూళ్లు ఘోరంగా పడిపోయాయి. విరూపాక్ష వస్తే అసలు ఈ సినిమా థియేటర్లలో ఉండనే ఉండదు. ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ సినిమా 10 కోట్ల గ్రాస్, 4.20 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది. రు. 24 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా… రు. 16 కోట్ల నష్టాలు తప్పేలా లేవు.