సౌత్ ఇండియా కు చెందిన దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దం పాటు తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. శ్రీదేవి సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అయినా బాలీవుడ్లోకి వెళ్ళాక బోనీకపూర్ను పెళ్లి చేసుకున్నారు. శ్రీదేవి ఆకస్మిక మృతి తర్వాత పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు.
జాన్వీకపూర్ను బాలీవుడ్ లోకి తీసుకు వచ్చేందుకు గత మూడు, నాలుగేళ్లుగా చాలా ప్రయత్నాలే జరిగాయి. అవేవి కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు యంగ్టైగర్ ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్లో ఆమె హీరోయిన్గా ఎంపికైంది. కొరటాల శివ దర్శకత్వం వహించే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. ఇక తాజాగా ఈ సినిమాలో మరో ఫ్యీజులు ఎగిరే అప్డేట్ వచ్చింది.
బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్గా ఫిక్స్ అయ్యాడు. ఈ రోజు సెట్లోకి సైఫ్ కూడా ఎంటర్ అయ్యాడు. ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ రోజు షూటింగ్ సెట్లోకే జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. తొలి రోజే ఎన్టీఆర్ను ఆమె ఆటపట్టించే రొమాంటిక్ సీన్ దర్శకుడు షూట్ చేసినట్టుగా తెలుస్తోంది.
జాన్వీ గ్రీన్ కలర్ లంగావోణీ వేసుకుని.. ఎన్టీఆర్తో ప్రేమాట ఆడే సీన్లో భాగంగా షూటింగ్ జరిగిందంటున్నారు. ఏదేమైనా జాన్వీ ఎంటర్ అయిన రోజే అటు ఈ సినిమా విలన్ సైఫ్ ఆలీఖాన్ అంటూ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. మరి ఈ సినిమా నుంచి ఇంకెన్ని ఇంట్రస్టింగ్ అప్డేట్లు వస్తాయో ? చూడాలి.