అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తొలి రోజు నుంచే ఆశించిన టాక్ రాలేదు. సినిమా భారీ నష్టాలను మిగల్చబోతోందంటూ ట్రేడ్ వర్గాలు, టాలీవుడ్ వర్గాలు ఓ అంచనాకు వచ్చేశాయి. అయితే ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కస్టడీ సినిమా డిజాస్టర్ నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడు వెంకట్ ప్రభుపై ట్రోలింగ్ అందుకున్నారు.
అదేంటి వీళ్లు వెంకట్ ప్రభును ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే దీని వెనక ఓ స్టోరీ ఉంది. ప్రభాస్ సాహో రిలీజ్ అయినప్పుడు అది తమిళ్లో అనుకున్నంతగా ఆడలేదు. సాహో హిందీలోనే బాగా ఆడింది. అదే టైంలో కోలీవుడ్లో సాహోతో పాటు వైభవ్ నటించిన సిక్సర్ సినిమా రిలీజ్ అవ్వగా.. వెంకట్ ప్రభు రెండు సినిమాలను పోల్చుతూ ఈ వీకెండ్ సిక్సర్ గ్యారెంటీ అని క్యాప్షన్ పెట్టాడు.
ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ప్రభాస్ కస్టడీతో పెద్ద ప్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో రంగంలోకి దిగిపోయారు. వెంకట్ ప్రభును ఈ సిక్సర్ ఎలా ఉందని ఆడుకోవడం మొదలు పెట్టేశారు. దీంతో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ వార్లోకి ఎంటర్ అవుతున్నారు.
కస్టడీ తెలుగుతో పాటు అటు తమిళ్లోనూ అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ వెంకట్ ప్రభు సాహో టైంలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ చేస్తూ కర్మ అనేది ఎవ్వరిని వదిలిపెట్టదు… కాస్త ఆలస్యంగా అయినా ఎవ్వరికి ఇవ్వాల్సిన ప్రతిఫలం వాళ్లకు ఇచ్చేస్తుంది అంటూ కౌంటర్లు పెడుతున్నారు.