సింహాద్రి రీ రిలీజ్ క‌లెక్ష‌న్లు ఈ మంచి ప‌నికోసం వాడుతున్నారా… హ్యాట్సాఫ్ తార‌క్‌..!

టాలీవుడ్ స్టార్ హీరోల పాత సినిమాలు వరుస పెట్టి రీ రిలీజ్ అవుతున్నాయి. తమ హీరోల పుట్టినరోజు నాడు పాత సినిమాలు రిలీజ్ అవుతుండడంతో.. ఆ హీరోల అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ లో కూడా కళ్ళు తిరిగే కలెక్షన్లు రాబట్టాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నుంచి ఖుషి, తమ్ముడు, జల్సా సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. మహేష్ బాబు నుంచి ఒక్కడు, పోకిరి సినిమాలు రీరిలీజ్ అయ్యాయి.

రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ ఆరెంజ్ కూడా రీ రిలీజ్ అయ్యి అంద‌రికి షాక్ ఇస్తూ ఏకంగా రు. 3 కోట్లకి పైగా కలెక్షన్లు రాబ‌ట్టింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు స్పెషల్ గా అతని సూపర్ హిట్ దేశముదురు రీ రిలీజ్ చేశారు. అలాగే ఎన్టీఆర్ డిజాస్ట‌ర్ మూవీ ఆంధ్రావాలా కూడా రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలు మూడు రోజుల నుంచి వారం రోజుల వ‌ర‌కు కూడా థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించారు.

ఇక ఇప్పుడు మే 20న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రెండు ఎన్టీఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఆదితో పాటు ఎన్టీఆర్ ట్రెండ్ సెట్ మూవీ సింహాద్రిని రీరిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం 4కె డిజిటల్ వర్క్ న‌డుస్తోంది. ఎన్టీఆర్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ ఈ సినిమాను కొని మ‌రీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రీ రిలీజ్‌పై తార‌క్ ఫ్యాన్స్ ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు.

ఈ సినిమా ద్వారా వ‌చ్చే వ‌సూళ్లును ఎన్టీఆర్ అభిమానుల్లో పేద‌వాళ్ల‌తో పాటు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న అభిమానులకి సహాయం చేస్తున్నామ‌ని.. ఎన్టీఆర్ కూడా త‌మ నిర్ణ‌యాన్ని అభినందించార‌ని వారు తెలిపారు. త‌మ నిర్ణ‌యానికి త‌మ అభిమాన హీరో నుంచి మంచి ఎంక‌రేజ్ మెంట్ వ‌చ్చింద‌ని వారు ఖుషీగా ఉన్నారు.

Tags: film news, filmy updates, intresting news, jr ntr, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news