టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఎన్టీఆర్ తన సినిమాల విషయంలో జరుగుతున్న కొన్ని తప్పులను సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది. లేకపోతే ఎన్టీఆర్ పరువు పోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో పాత సినిమాల ట్రెండ్ నడుస్తోంది. మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ – బన్నీ నటించిన పాత సినిమాలు విచిత్రం ఏంటంటే ఆరెంజ్ లాంటి సినిమాలు కూడా రీ రిలీజ్ లో అదిరిపోయే వసూళ్లు కొల్లగొడుతున్నాయి.
పాత సినిమాలను రిలీజ్ చేసినప్పుడు ఆయా హీరోల అభిమానులు కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమా ఆంధ్రావాలాను గత నెలలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఘోరమైన వసూళ్లతో ఎన్టీఆర్ పరువు తీసేసింది. అసలు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమాను రిలీజ్ చేయవద్దని ఎంత వేడుకున్నా ఎవరు వినలేదు. ఎన్టీఆర్ కూడా దీనిని పట్టించుకోలేదు. దీంతో ఆంధ్రావాలా సినిమా మరోసారి థియేటర్లో రిలీజ్ అయి చెత్త రికార్డు మూటాకట్టుకుంది.
ఇదిలా ఉంటే ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ సింహాద్రి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే అదే రోజు ఎన్టీఆర్ మరో బ్లాక్ బస్టర్ ఆది సినిమా కూడా రీ రిలీజ్ అవుతుంది. ఇలా ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు రిలీజ్ అయితే నిజంగా అభిమానులు ఏ సినిమా చూడాలో తెలియక డైలమాలో పడతారు. ఇలాంటి సమయంలో ఆ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు ?కూడా రావు. ఇదంతా ఇతర స్టార్ హీరోల అభిమానులకు పెద్ద ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఎన్టీఆర్ మరోసారి ట్రోలింగ్కు గురికాక తప్పదు.
దీనిపై ఎన్టీఆర్ రంగంలోకి దిగి ఏదో ఒక సినిమాను మాత్రమే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తే బాగుంటుందని.. లేకపోతే మరోసారి ఎన్టీఆర్ పరువు పోయినట్టు అవుతుందని ఎన్టీఆర్ అభిమానులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎన్టీఆర్ చొరవ తీసుకొని మే 20న ఆది, సింహాద్రి సినిమాలలో ఏదో ఒక సినిమా మాత్రమే రిలీజ్ చేసేలా ప్లాన్ చేయిస్తే బాగుంటుందని కోరుతున్నారు.