దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలోకి వచ్చింది జాన్వీకపూర్. హిందీలో ముందుగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ 30వ సినిమా ద్వారా టాలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా.. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ కానుంది.
ఈ సినిమా కోసం జాన్వీ కళ్లుచెదిరిపోయే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. స్టార్ హీరోయిన్లను మించిన రేంజ్లో ఏకంగా రు 3.5 కోట్ల రెమ్యునరేషన్ జాన్వీకి ఇస్తున్నారు. తెలుగులో తొలి సినిమాకే ఈ రేంజ్ రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదు. జాన్వీ టాలీవుడ్ సినిమాలు ఒప్పుకుంటున్నా రేటు విషయంలో మాత్రం బెట్టు వీడడం లేదట.
ఇక ఎన్టీఆర్ సినిమా తర్వాత ఆమె రామ్చరణ్ – బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చే సినిమాకు కూడా ఓకే చెప్పేసింది. ఈ ఏడాది ఆఖరు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఇప్పటికే ఏఆర్ రెహమాన్ ను ఎంపిక చేశారు. ఇప్పుడు హీరోయిన్ వేట కొనసాగుతోందట. ఉప్పెన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని బుచ్చిబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
బుచ్చిబాబు ఆలోచనలు అన్నీ పాన్ ఇండియా లెవల్లో ఉన్నాయి. అందుకే ఈ సినిమా కోసం జాన్వీని తీసుకుంటే పాన్ ఇండియా వైడ్గా మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నాడట. జగదీకవీరుడు అతిలోక సుందరి తరహాలో మెగాస్టార్ చిరంజీవి – శ్రీదేవి కాంబినేషన్ ఎంత హిట్ అయ్యిందో ఇప్పుడు జాన్వీ – చరణ్ కాంబినేషన్ కూడా అంతే పెద్ద హిట్ అవుతుందన్నదే బుచ్చిబాబు ప్లాన్. ఈ సినిమా కోసం జాన్వీకి ఏకంగా రు. 5 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తే గాని ఆమె ఓకే చెప్పలేదట. ఏదేమైనా జాన్వీ తెలుగు నిర్మాతలను బాగా పిండేస్తుందనే అంటున్నారు.