సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే 2020 సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా బన్నీ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమాకు పోటీగా వచ్చి మరీ సూపర్ హిట్ కొట్టింది. అప్పట్లోనే ఈ సినిమా రూ.130 కోట్లకు పైగా భారీ కలెక్షన్లు రాబట్టుకుని సెన్సేషనల్ హిట్గా నిలిచింది.
అంతేకాకుండా నాన్ రాజమౌళి టాప్ ఫైవ్ సినిమాల్లో ఒకటిగా సరిలేరు నీకెవ్వరు రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక మామూలు సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా భారీ కలెక్షన్లను అందుకుంది. ఇలాంటి బిగ్గెస్ట్ సినిమాను ముందుగా దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ బాబు కోసం రాసుకోలేదట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఆ కథను అనుకున్నారట.
ఎన్టీఆర్ను దృష్టిలో పెట్టుకునే కథను రాసుకున్నారట. అంతేకాకుండా ఎన్టీఆర్కు కూడా ఆ కథను చెప్పగా.. తారక్కు ఆ స్టోరీ నచ్చిన ఫ్యూచర్లో చేద్దామని చెప్పారట. అప్పటికే ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో అనిల్ రావిపూడి సినిమాకు డేట్లు ఇవ్వలేకపోయారు. దాంతో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేకపోయింది.
ఇంతలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి అనిల్ రావిపూడికి కాల్ వచ్చిందట. ఒక కథ ఉంది అని అన్నావట కదా, వచ్చి నేరేట్ చెయ్యమన్నాడట. అప్పుడు ఆయన దగ్గర ఉన్న సరిలేరు నీకెవ్వరూ స్టోరీని వినిపించాడట. మహేష్ బాబుకి ఆ కథ బాగా నచ్చింది , వెంటనే సినిమా ప్రారంభించారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెలిసిందే. అలా ఎన్టీఆర్ మిస్ అయిన బ్లాక్బస్టర్ మహేష్ ఖాతాలో పడింది.