ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్టీఆర్ సరసన చాలా సినిమాల్లో నటించింది బి.సరోజ. పాండురంగ మహత్యం సినిమాలో వేశ్య క్యారెక్టర్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సరోజ సినీ ఇండస్ట్రీలో ప్రవేశించిన కొత్తలో సావిత్రి భర్త జెమినీ గణేషన్తో మంచి కలివిడిగా ఉండేదట. గణేషన్ తో కలిసి విహారయాత్రలు కూడా చేసిందంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.
అప్పటికే సావిత్రితో పెళ్లి జరిగి పిల్లలు ఉన్న జెమినీ గణేషన్ మాత్రం ఆడవారి విషయంలో దూకుడుగానే ప్రవర్తించేవాడు. వీరిద్దరూ చనువుగా ఉండడం గమనించిన అప్పటి గడుసు హీరోయిన్గా పేరున్న సూర్యకాంతం సావిత్రికి నీ మొగుడు వేరే హీరోయిన్తో తిరుగుతున్నాడని హెచ్చరించిందట. జెమినీ గణేషన్ పై ఉన్న ప్రేమతోనో మరే కారణంతోనో సావిత్రి సూర్యకాంతం చెప్పిన మాటలను నమ్మేది కాదట.
పైగా తన మొగుడు పై నిందలు వేస్తుందని భావించేదట. ఇది చాలా కాలం చర్చకు రాలేదు. సూర్యకాంతం మాత్రం బి.సరోజకి అప్పట్లో అవకాశాలు రాకుండా అడ్డుకుందని తిరుపతమ్మ కథ సినిమాలో సరోజ ఎన్టీఆర్ సరసన నటించకుండ ఎన్టీఆర్ని ఓప్పించిందన్న పుకార్లు ఉండేవి. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో అవకాశాలు రాకుండా చేసిందని వార్తలు వినిపించాయి.
కానీ అప్పటికే సావిత్రి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. ఆమె ఆసుపత్రి పాలు కూడా అయింది. ఈ విషయం తెలుసుకున్న సూర్యకాంతం నేను చెప్పిన మాట వినిపించుకుని ఉంటే సావిత్రి ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు అని ఆమె కుటుంబానికి చెప్పిందట.