టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సాగుతున్న యాత్రకు భారీ స్పందన వస్తోంది. యువత పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి నారా లోకేష్కు మద్దతు తెలుపుతున్నారు. తన పాదయాత్ర సాగుతున్న సమయంలో లోకేష్.. కొన్ని కొన్ని విషయాలను ప్రజలకు గుర్తు చేస్తున్నారు.
కియా కార్ల పరిశ్రమ సహా.. తమ హయాంలో వచ్చిన పెట్టు బడులను నారా లోకేష్ గుర్తు చేస్తున్నారు. పాద యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాల మీదుగా నడిచినప్పుడు.. ప్రత్యేకంగా.. వాటి దగ్గర నిలబడి.. సెల్ఫీలు దిగుతున్నారు. వాటిని సోషల్ మీడియాలోనూ పోస్టు చేస్తున్నారు. అంతేకాదు.. వైసీపీకి ఛాలెంజ్ కూడా విసురుతున్నారు. మేం.. కియాను తీసుకువచ్చాం.. మీరు ఏం తెచ్చారో.. చెప్పండి..! అని నారాలోకేష్ వేస్తున్న పంచ్లు బాగానే పేలుతున్నాయి.
పాదయాత్రలో మరో విశేషం… సెల్ఫీలు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న యువత.. నారా లోకేష్తో సెల్పీ దిగేందుకు ఎగబడుతున్నారనే చెప్పాలి. ఇక, ఈ కార్యక్రమం కోసం.. నారా లోకేష్ ఏకంగా గంట సేపు సమయం కేటాయిస్తున్నారు. దీనికి మంచి ఫాలోయింగ్ రావడంతోపాటు. ప్రజల్లోనూ మంచి గుర్తింపు వచ్చింది. అదే సమయంలో స్థానికంగా కార్యకర్తలను, నాయకులను ఏకతాటిపై నడిపించేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి కొన్నికొన్నిచోట్ల అభ్యర్థులను కూడా నారా లోకేష్ ప్రకటిస్తున్నారు. అదేవి ధంగా ఎన్నికల హామీలు కూడా గుప్పిస్తున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్లు, ఉద్యోగ క్యాలెండర్, నియోకవర్గా నికో.. హాస్టల్.. ఇలా.. అనేక హామీలు గుపిస్తున్నారు. తన దగ్గరకు వచ్చే వారి సమస్యలు వింటున్నారు. అదేవిధంగా.. వారికి ధైర్యం చెబుతున్నారు. మొత్తంగా.. చూస్తే పాదయాత్ర సక్సెస్ అవుతోందని అంటున్నారు పరిశీలకులు.