టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠిలు తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో సినీ ప్రముఖులు, అభిమానులు వారికి విషెస్ చెబుతున్నారు. అయితే ఈ నిశ్చితార్థ వేడుకను కొందరు సన్నిహితుల మధ్య మాత్రమే జరుపుకున్నారు. మెగా కుటుంబంతో పాటు కొందరు ఆత్మీయులు ఈ ఎంగేజ్మెంట్కు హాజరయ్యారు.
ఇక శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఎంగేజ్మెంట్లో లావణ్య త్రిపాఠి అనితా డోంగ్రే డిజైన్ చేసిన శారీలో తళుక్కున మెరిసింది. అయితే, ఈ నిశ్చితార్థం కంటే ముందే, లవాణ్య తన తల్లితో కలిసి హైదరాబాద్లోని వరుణ్ తేజ్ ఇంటికి చేరుకుంది. ట్రెడిషినల్ లుక్లో, తలలో మల్లెపూలు పెట్టుకుని అచ్చతెలుగు అమ్మాయిలా లావణ్య కనిపించడంతో అందరూ ఆమె అందానికి ఫిదా అయ్యారు.
వరుణ్ తేజ్-లావణ్యల నిశ్చితార్థానికి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, రామ్ చరణ్ ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్లతో పాటు సుస్మిత, శ్రీజలు కూడా హాజరయ్యారు. వైభవంగా జరిగిని ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.