సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ లు పెళ్లి చేసుకోవడం ఇప్పడు కామన్ అయిపోయింది. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొందరు పెద్ద వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటుంటే మరికొంత మంది పెద్ద వారికి వ్యతిరేకించి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే మరి కొత్త మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని విడిపోతున్నారు. మరి కొందరు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇలాంటి జంటలో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ జంట ముందుంటారని మాట్లాడుకుంటుంటారు. వీరిద్దరూ కలిసి వంశీ సినిమాలో మొదటిసారి నటించారు. ఆ సమయంలోనే వీరికి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారి తీసింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోడానికి కారణం మహేష్ బాబు తల్లి ఇందిర దేవి అంట.
అయితే మహేష్ బాబు పెళ్ళికి ముందు సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోలేదట. దీనికి కారణం కూడా ఉంది. మహేష్ బాబుకి ఒక తెలుగు అమ్మాయితోనే పెళ్లి చేయాలని కృష్ణ అనుకున్నారు.
నమ్రత ముంబైకి చెందిన అమ్మాయి కడవంతో మహేష్ బాబుతో పెళ్లికి నో చెప్పారు. అయితే మహేష్ బాబు మాత్రం నమ్రతను మర్చిపోలేకపోయారు. వెంటనే మహేష్ ముంబైకి వెళ్లి నమ్రతని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన కృష్ణ సీరియస్ అయ్యారు. అయితే ఇందిర దేవి కృష్ణని కూర్చోబెట్టి మాట్లాడి మహేష్ బాబు పెళ్లికి ఒప్పించారు.
ఆ తరువాత కృష్ణ ముంబైకి వెళ్లి మహేష్ బాబు, నమ్రతని దీవించారు. నమ్రత పెళ్ళికి ముందు హిందీలో చాలా సినిమాలే చేసింది. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. అయితే తెలుగులో మాత్రం ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు. పెళ్లి తరువాత నమ్రత సినిమాలకు దూరం అయ్యింది. మహేష్, నమ్రతకి ఇద్దరు పిల్లలు. వీరిద్దరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు.