జగమే మాయ సినిమాతో నటుడుగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు సీనియర్ నటుడు మురళీమోహన్. ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో సపోర్టింగ్ పాత్రలో నటిస్తూ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నాడు. ఈ విధంగా చిత్ర పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఎన్నో పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీమోహన్ నటుడు గానే కాకుండా నిర్మాతగాకూడా ఎన్నో సినిమాలను నిర్మించారు. అన్నింటికి మించి ఆయన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎంతో సక్సెస్ అయ్యారు.
మురళీమోహన్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయాలలో కూడా తనదేన ముద్ర వేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న మురళీమోహన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా మురళీమోహన్ తన కెరీర్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.
ఆ ఇంటర్వ్యూలో మురళీమోహన్ మాట్లాడుతూ తాను చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతానని అనుకున్నానని.. అయితే ఇప్పుడు ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అగ్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి తాను వీరాభిమానినని.. ఒకానొక సందర్భంలో నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీలో ఉన్న శ్రీరామచంద్రుడు నువ్వే అని ఆయన నాకు సర్టిఫికెట్ ఇచ్చారని కూడా చెప్పుకొచ్చారు.
ఇక ఆయన నాకు అలా సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదని తెలిపారు. తాను చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్న సమయంలోనే అతిలోక సుందరి శ్రీదేవిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ అమ్మగారు ప్లాన్ చేశారని మురళీమోహన్ చెప్పుకొచ్చారు. శ్రీదేవి వాళ్ళ అమ్మ గారు నన్ను చూసి చాలా బుద్ధిమంతుడులా ఉన్నాడు.. బాగున్నాడు ఇలాంటి అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తే బాగుంటుందని ఇండస్ట్రీ వాళ్ల ద్వారా పెళ్లి ప్రపోజల్ చేశారని నాటి సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నాడు.