యువగళం పాదయాత్రలో పార్టీ యువనేత, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెల్ఫీలతో హైలెట్ అయ్యారు. ఎంతోమంది యువతతో ఆయన సెల్ఫీలు దిగుతున్నారు. ఇంకా చెప్పాలంటే లోకేష్తో సెల్ఫీలు దిగేందుకు యువత, పెద్దలు క్యూలో ఉంటున్నారు. లోకేష్ కూడా ఒక్కో సమస్యను సెల్ఫీ రూపంలో చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా తన తనయుడు లోకేష్ రూట్లోనే సెల్ఫీతో సమస్యను చెప్పేందుకు ప్రయత్నించడం విశేషం. చంద్రబాబు సెల్ఫీతో ఈ సమస్యను ఎత్తిచూపుతూ ముఖ్యమంత్రి జగన్ను సూటిగా ప్రశ్నించారు. ఇక చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పట్టణాల్లో వేలాదిగా టిడ్కో ఇళ్లు నిర్మించారు.
అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని లబ్ధిదారులకు ఇవ్వలేదు. అవి ఇప్పటకీ అలాగే నిరుపయోగంగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరులో కొన్ని వేల టిడ్కో ఇళ్లను నిర్మించారు. ఈ రోజు నెల్లూరులో టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్ల దగ్గర కారులో ఉంటూనే సెల్ఫీ దిగిన చంద్రబాబు రాష్ట్రంలో మా ప్రభుత్వ హయాంలో ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు ఇవి..!
రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు ఇవి. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా? అని సూటిగా ప్రశ్నించారు. ఏదేమైనా చంద్రబాబు ఒక్క సెల్ఫీతో జగన్ను చాలా సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జగన్ దగ్గర ఆన్సర్లే లేకుండా పోయినట్లయ్యిందన్న ట్రెండింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోంది.
చూడు… @ysjagan! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు!
ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?#SelfieChallengeToJagan pic.twitter.com/1yoMGd4yf9
— N Chandrababu Naidu (@ncbn) April 7, 2023