తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. వారు హీరోయిన్స్ గా ఎక్కువ కాలం కొనసాగడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అదే సమయంలో వారి కంటే పెద్ద వయసు ఉన్న హీరోలతో కూడా నటిస్తూ ఉంటారు. కాని హీరోల కెరియర్ మాత్రం చాలా సంవత్సరాలు కొనసాగుతూనే ఉంటుంది. సీనియర్ హీరోలు వాళ్ళకంటే చిన్నవారైనా హీరోయిన్లతో జత కట్టాల్సి ఉంటుంది.
కొందరు హీరోయిన్లు కొడుకుతో నటిస్తూనే, తండ్రితోను, బాబాయితోను కూడా నటిస్తూ ఉంటారు. అలా మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ముగ్గురితో కొంతమంది హీరోయిన్లు నటించారు. వాళ్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఆమె రామ్ చరణ్ తో మగధీర, నాయక్ సినిమాల్లో నటించగా, పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించి మెప్పించింది.
ఇక ఖైదీ నెంబర్ 150 సినిమాలో చిరంజీవికి జోడీ కట్టింది. తమన్నా కూడా రామ్ చరణ్ తో రచ్చ సినిమాలో, పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్లో, చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించింది. ప్రస్తుతం చిరంజీవి బోళా శంకర్ సినిమాలో కూడా తమన్నానటిస్తోంది. కాజల్, తమన్నా ఇద్దరు కూడా ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అయినా వారి క్రేజ్ అలాగే కొనసాగుతోంది.
కరోనా టైంలో పెళ్లి చేసుకున్న కాజల్ బాబు పుట్టిన తరువాత మదర్ హుడ్ ను ఎంజాయ్ చేస్తూ సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది కాజల్. ప్రస్తుతం బాలకృష్ణ తో ఎన్ బి కే 108 సినిమాలో నటిస్తోంది.