తెలుగు ఇండస్ట్రీలో అంచల అంచలుగా స్టార్ హీరోగా ఎదిగి కోట్లలో అభిమానులున స్టార్ హీరోలు చాలా తక్కువ మంది.ఏ సినిమాకైనా ఒక్కసారి పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఆ సినిమాలో కలెక్షన్లు రికార్డులు బద్దలు కొట్టి స్టేజ్లో ఉంటాయి. అలా మనం చెప్పుకోబోతున్న ఈ స్టార్ హీరోలు ఇటీవల కాలంలో తమ సినిమాల ద్వారా బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే వాళ్ళలో ఏ హీరో ఎంత చదువుకున్నారో మనం తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ లో బీభత్సంగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. పవన్ సినిమా రిలీజ్ అయితే తొలి రోజు వసూళ్లు మోత మోగిపోతాయి. పవన్ కళ్యాణ్ తను ఇంటర్ వరకే చదివారు. జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఆల్ ఇండియా హీరోగా మారాడు. అతను ఇంటర్ తో తన చదువును ఆపేశారు. టాలీవుడ్ సూపర్స్టార్ ప్రిన్స్ మహేష్ బికాం కంప్లీట్ చేశారు.
బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల ద్వారా పాన్ ఇండియా హీరోగా మారి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ ఇంజనీరింగ్ వరకు చదువుకున్నారు. అల్లు అర్జున్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశాడు. మెగా హీరో రామ్ చరణ్ లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందారు.
మెగాస్టార్ చిరంజీవి బీకాం కంప్లీట్ చేశారు. బాలకృష్ణ నిజాం కాలేజ్లో కామర్స్ విద్యను కంప్లీట్ చేశారు. వెంకటేష్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. తెలుగు ఇండస్ట్రీలో చాలా హిట్ సినిమాలలో నటించిన నాగార్జున అమెరికాలో సివిల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఇక శర్వానంద్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.