ఎన్టీఆర్ తర్వాత నందమూరి వారసులుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది వచ్చినా వారిలో కేవలం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే నిలదొక్కుకొగలిగారు. వారిద్దరి తర్వాత అంత క్రేజ్ నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రమే సంపాదించుకున్నారు. కళ్యాణ్ రామ్ హీరో గానే కాకుండా సొంత బ్యానర్ పై సినిమాలను తీస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణ్రామ్ బింబిసారా అనే సినిమాతో సూపర్ హిట్ సొంతం చేసుకుని రీసెంట్గా అమీగోస్ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ 2006 ఆగస్టు 10వ తేదీన స్వాతిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరిది పెద్దలుకుదిర్చిన వివాహం. స్వాతిని చూసిన తొలిచూపులోనే కళ్యాణ్ రామ్ తనపై మనసు పారేసుకున్నాడు. అయితే వీరు వివాహం తర్వాత వీరికి ఇద్దరు కుమారులు పుట్టారు. స్వాతి వృత్తిరీత్యా డాక్టర్. స్వాతి వాళ్ళది రిచ్ ఫ్యామిలీ. ఆమె తండ్రి ఫార్మా ఇండస్ట్రీలతో పాటు ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలను రన్ చేస్తూ ఉంటారు.
స్వాతి తన భర్త అయిన కళ్యాణ్ రామ్ సినిమాలను చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తారట. అయితే శర్వానంద్ నటించిన శతమానం భవతి సినిమా చూసిన తర్వాత నువ్వు ఇలాంటి సినిమాల్లో నటించవచ్చు కదా ? అని కళ్యాణ్ రామ్కు క్లాస్ తీసుకుందట. కళ్యాణ్ రామ్ అప్పటినుంచి అన్ని రకాల పాత్రలను చేయడానికి ట్రై చేస్తున్నాడట. అయితే స్వాతి తన కాలేజ్ టైమ్ నుంచి కింగ్ నాగార్జునకు పెద్ద ఫ్యాన్.
తను కాలేజ్ చదువుకునే రోజుల్లో కాలేజ్కు బంక్ కొట్టి మరి మన్మధుడు సినిమా చూడడానికి వెళ్లారట.అయితే స్వాతిపెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత తన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేవరకు ఇంట్లో ఉండి వారి బాగోగులు చూస్తూ ఉండేది. ప్రస్తుతం ఆమె విఎఫ్ వస్ పేరుతో సంస్థను స్థాపించి షార్ట్ ఫిలింస్ గ్రాఫిక్స్ ను అందిస్తు ఉంటుంది. అలా స్వాతి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.